హైదరాబాద్, జనవరి 30 : చిన్నతనంలోనే గొప్ప స్ప్రహతో 65 వేల సీడ్ బాల్స్ తయారుచేసిన సిరిసిల్ల జిల్లా సుద్దాల గ్రామానికి చెందిన ఎనిమిదేండ్ల బాలిక డీ బ్లెస్సీని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు అభినందించారు. ప్రకృతి మీద ప్రేమ, పర్యావరణ పరిరక్షణ కోసం బ్లెస్సీ తన 8వ పుట్టినరోజు సోమవారం (జనవరి 31) గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా సీడ్ బాల్స్ను నాటనున్నది. ఆదివారం ట్విట్టర్ వేదికగా బాలికను కేటీఆర్ అభినందించారు. పర్యావరణ పరిరక్షణ కోసం కృషిచేస్తున్న ఆమెకు దీవెనలని కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. బ్లెస్సీ కృషిని, పట్టుదలను, స్ఫూర్తిని అభినందించడానికి పదాలు సరిపోవని గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త, ఎంపీ సంతోష్కుమార్ అన్నారు. ట్విట్టర్ ద్వారా ఆమెను అభినందించారు. బ్లెస్సీకి ముందస్తుగా బర్త్ డే విషెస్ చెప్పారు.