IND vs ENG 3rd Test : రాజ్కోట్ టెస్టులో మూడో రోజు ఇంగ్లండ్(England)స్వల్ప స్కోర్కే కుప్పకూలింది. లంచ్ తర్వాత భారత బౌలర్లు చెలరేగడంతో టపటపా వికెట్లు కోల్పోయి 319 పరుగులకే ఆలౌటయ్యింది. పేసర్ సిరాజ్(Siraj) నాలుగు వికెట్లతో ఇంగ్లండ్ పతనాన్ని శాసించాడు. దాంతో, టీమిండియాకు 126 పరుగుల ఆధిక్యం లభించింది. లంచ్కు ముందు 290/ 5తో పటిష్ట స్థితిలో కనిపించిన స్టోక్స్ సేన అనూహ్యంగా మరో 29 పరుగులకే చాప చుట్టేసింది.
లంచ్ తర్వాత బంతి అందుకున్న జడేజా.. కెప్టెన్ బెన్ స్టోక్స్(41)ను ఔట్ చేశాడు. ఆ కాసేపటికే సిరాజ్ సూపర్ డెలివరీతో బెన్ ఫోక్స్(13)ను బోల్తా కొట్టించాడు. అప్పటికే ఆలౌట్ ప్రమాదంలో పడిన ఇంగ్లండ్.. పది పరుగుల తేడాతో చివరి మూడు వికెట్లు కోల్పోయింది.
Innings break!
England are all-out for 319 in the first-innings.
A successful afternoon session for #TeamIndia as @mdsirajofficial finishes with a four-wicket haul 👏👏
Scorecard ▶️ https://t.co/FM0hVG5X8M#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/gYC0WzQOUm
— BCCI (@BCCI) February 17, 2024
ఓవర్నైట్ స్కోర్ 207 /2 తో మూడో రోజు ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్కు తొలి సెషన్లోనే షాక్ తగలింది. ఆట మొదలైన కాసేపటికే జో రూట్(18)ను బుమ్రా బోల్తా కొట్టించాడు. ఆ తర్వాత కుల్దీప్ యాదవ్ కమాల్ చేశాడు. డేంజరస్ జానీ బెయిర్స్టో(0), ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్(153)లను ఔట్ చేశాడు. ఆ తర్వాత స్టోక్స్, ఫోక్స్ పట్టుదలగా ఆడడంతో లంచ్ సమయానికి ఇంగ్లండ్ 290 రన్స్ కొట్టింది.
Stokes gone! Foakes gone!
Back-to-back wickets for India 🔥#INDvENG
— ESPNcricinfo (@ESPNcricinfo) February 17, 2024
వైజాగ్ టెస్టులో స్టోక్స్ సేనను చిత్తు చేసిన భారత్ కీలకమైన రాజ్కోట్ టెస్టులో దంచికొట్టింది. తొలిరోజు కెప్టెన్ రోహిత్ శర్మ(132), ఆల్రౌండర్ రవీంద్ర జడేజా(112)లు శతకాలతో కదం తొక్కారు. అరంగేట్రం చేసిన సర్ఫరాజ్ ఖాన్(62), ధ్రువ్ జురెల్(46)లు ధనాధన్ ఆడడంతో తొలి ఇన్నింగ్స్లో టీమిండియా 445 రన్స్ కొట్టింది.
బెన్ డకెట్(153)
అనంతరం ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్కు ఓపెనర్ బెన్ డకెట్(118 నాటౌట్), జాక్ క్రాలే(15) శుభారంభం అందించారు. అయితే.. అశ్విన్ బౌలింగ్లో క్రాలే 500 వికెట్గా ఔట్ కాగా.. ఉప్పల్ టెస్టు హీరో పోప్(39)ను సిరాజ్ ఎల్బీగా వెనక్కి పంపాడు. దాంతో, తొలి రోజు ఆటముగసే సరికి ఇంగ్లండ్ 2 వికెట్ల నష్టానికి 207 రన్స్ కొట్టింది.