Farmers Protest | సాధారణంగా ప్రజాందోళనలను నియంత్రించేందుకు పోలీసులు లాఠీ చార్జీ చేస్తుంటారు. ఆందోళనలు మరింత చేయి దాటితే ఫైరింగ్ చేస్తారు. అంతకు ముందు రబ్బర్ బుల్లెట్లు వాడతారు. ఇక లాఠీ చార్జీకి ముందు కూడా పోలీసులు వాటర్ కెనాన్లు ఉపయోగిస్తారు. అంటే నీటి ఫిరంగ్లతో ఆందోళనకారులను చెదరగొడతారు. కానీ ఈ సారి రైతు ఆందోళనలను రాజధాని ఢిల్లీ వరకు రాకుండా నియంత్రించడానికి, రైతులను చెదర గొట్టడానికి పోలీసులు ఓ ఆధునిక పద్ధతిని ఉపయోగిస్తున్నారు. దాని పేరే సౌండ్ కెనాన్. మీరిప్పటి వరకు దీని పేరు వినక పోయి ఉండవచ్చు.
పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) హామీ చట్టం, రుణమాఫీ సహా 12 డిమాండ్లతో మరోసారి… ఢిల్లీకి పాదయాత్ర చేయాలనుకుంటున్న రైతులు హర్యానా సరిహద్దులో నిలబడి ఉన్నారు. శంభు, దాతాసింగ్ వాలా-ఖానౌరీ సరిహద్దుల్లో రైతులు నిరసనలు చేస్తున్నారు. పోలీసులు రైతులను బారికేడ్లతో అడ్డుకున్నారు. అయినా ఢిల్లీకి పాదయాత్ర చేసేందుకు యత్నిస్తున్న రైతులు బారికేడ్ను కూడా విరగ్గొట్టేందుకు ప్రయత్నించారు. ఆందోళన చేస్తున్న రైతులను ఢిల్లీకి రాకుండా అడ్డుకునేందుకు ఢిల్లీ పోలీసులు కూడా విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. ఢిల్లీ పోలీసులు కూడా తన వ్యూహంలో కొత్త టెక్నాలజీలను ఉపయోగించారు. ఇది ఢిల్లీకి చేరుకున్నప్పుడు గుంపును చెదరగొట్టడానికి లాంగ్-రేంజ్ అకౌస్టిక్ డివైస్ (LRAD) అంటే సౌండ్ కెనాన్ (ఫిరంగి)ని మోహరించింది.
సౌండ్ ఫిరంగి అనేది ఒక ప్రత్యేక రకం లౌడ్ స్పీకర్, ఇది చాలా దూరం వరకు పెద్ద ధ్వనిని ఉత్పత్తి చేస్తుంది. ఈ స్పీకర్ నుంచి వచ్చే శబ్దం యొక్క డెసిబెల్ సామర్ధ్యం నుంచి ఒక మీటరు వద్ద 160 dB వరకు ఉంటుంది. సామాన్యంగా ఒక మనిషి 50-60 డీబీ వరకు శబ్దాలను వినే సామర్థ్యాన్ని మాత్రమే వినగలుగుతారు. గుంపు నియంత్రణకు సౌండ్ ఫిరంగులను ఒక పద్ధతిగా ఉపయోగిస్తారు. సముద్రంలో పైరసీని ఎదుర్కోవడానికి ముట్టడి పరిస్థితుల్లో చర్చలు జరపడానికి ఈ పరికరం ఉపయోగించబడుతుంది. ఇది ప్రకృతి వైపరీత్యాలు లేదా ఇతర అత్యవసర పరిస్థితుల్లో, అనేక నౌకాదళాలతో సహా రక్షణ దళాల ద్వారా మాస్ కమ్యూనికేషన్ కోసం కూడా ఉపయోగించబడింది.
LRAD ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడానికి, ఒక ఉదాహరణ ఏమిటంటే మీరు ఒక పార్కులో కూర్చుని చదువుకుంటున్నారని అనుకుందాం, ఒక ర్యాలీ అటునుంచి తీస్తున్నారనుకోండి. కానీ పోలీసులు అనుమతించిన, లేదా నిర్ధారించిన మార్గంలోనే ర్యాలీ వెల్తున్నదని నిర్ధారించడానికి LRAD ని ఏర్పాటు చేస్తారు. మీరు LRAD మార్గం మధ్యలో ఉన్నట్లయితే, మీపై కూడా అందరిలాగే దాని ప్రభావం పడుతుంది. మొదట మీకు అధిక ఫ్రీక్వెన్సీ శబ్దం వినబడుతుంది. ఆ శబ్దం వల్ల మీకు మైకంలా అనిపించవచ్చు. మీరు చాలా అసౌకర్యంగా, ఇబ్బందిగా ఫీలవుతారు. ఒక వేళ మీరు చాలాసేపు అలాగే ఉంటే అనారోగ్యానికి గురవుతారు. మీ చెవుల్లో నొప్పి కూడా అనిపిస్తుంది.
అమెరికన్ క్షిపణి విధ్వంసక నౌక USS కోల్పై ఆత్మాహుతి దాడి తర్వాత ఈ పరికరం సాధారణ ఉపయోగంలోకి వచ్చింది. 2000లో, యెమెన్లో క్షిపణి విధ్వంసక నౌకపై జరిగిన ఆత్మాహుతి దాడిలో 17 మంది US నేవీ నావికులు మరణించారు. 37 మంది గాయపడ్డారు. ఈ దాడి తర్వాత US నేవీ సౌండ్ ఫిరంగి పరికరాన్ని ఇన్స్టాల్ చేసింది. దూరం నుంచి వస్తున్న ఓడ గురించి తెలుసుకునేందుకు నౌకాదళం కోసం ఈ పరికరాన్ని తయారు చేసింది. రేడియో కాల్లకు స్పందించలేని దూరం నుంచి వచ్చే నేవీ షిప్లను సంప్రదించడానికి ఈ పరికరంతో సాధ్యమైతుంది.
ఈ పరికరం 2002లో మొదటగా ఉపయోగించడం మొదలు పెట్టారు. తర్వాత ఈ పరికరాలు అనేక ప్రయోజనాల కోసం ఉపయోగించడం ప్రారంభించారు. చెక్పాయింట్లు, గుంపులను నియంత్రించడం, సముద్ర యాన ఓడలు, మాస్ నోటిఫికేషన్, ముందస్తు హెచ్చరిక, భద్రత, సైనిక వినియోగం, వన్యప్రాణుల సంరక్షణ, నియంత్రణ వంటి వాటికోసం ఉపయోగిస్తున్నారు.
ఈ పరికరాలు కమ్యూనికేషన్ల కోసం, నిరసనలతో సహా అనేక గుంపు నియంత్రణ ప్రయోజనాల కోసం విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. 2022 కరోనా వ్యాక్సిన్పై ఆస్ట్రేలియాలోని కాన్బెర్రాలో జరిగిన ఆందోళనలో నిరసనకారులను చెల్లాచెదురు చేయడానికి ఈ పరికరం ఉపయోగించినప్పుడు ఇది వెలుగులోకి వచ్చింది. ఇది కాకుండా, చెక్ రిపబ్లిక్, జర్మనీ, గ్రీస్, జపాన్, న్యూజిలాండ్, పోలాండ్, సింగపూర్, స్పెయిన్, బ్రిటన్, అమెరికా వంటి దేశాలలో దీన్ని సందర్భానుసారంగా ఉపయోగిస్తున్నారు.