హైదరాబాద్ : సింగరేణి సంస్థ ఉద్యోగులకు పదవీ విరమణ వయసు పెంపు వెంటనే అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని సంస్థ సీఎండీ ఎన్ శ్రీధర్ను టీబీజీకేఎస్ అధ్యక్షుడు వెంకట్రావు కోరారు.
సోమవారం ఆయన హైదరాబాద్ సింగరేణి భవన్లో సీఎండీ ఎన్ శ్రీధర్ను కలిసి ఈ మేరకు వినతి పత్రం ఇచ్చారు. ఉద్యోగులకు పదవీ విరమణ వయసు పెంపు అమలయ్యేలా వీలైనంత త్వరగా మార్గదర్శకాలు విడుదల చేయాలని కోరారు.
రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులందరికీ మేలు జరిగేలా పదవీ విరమణ వయసు పెంచుతూ నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ప్రభుత్వ ఉద్యోగులతోపాటు ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులందరికీ పదవీ విరమణ వయసు పెంచుతూ ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి