హైదరాబాద్ ,జూన్ 7:తెలంగాణా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోన్న ప్రీమియం డెయిరీ బ్రాండ్ సిద్స్ ఫార్మ్ స్వచ్ఛమైన పాల ఉత్పత్తులను అందింస్తున్నది. ఈ కంపెనీ ఇప్పుడు ఎఫ్ఎస్ఎస్ఏఐ (ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) సూచించిన పాలు, పాల ఉత్పత్తుల నాణ్యతా ప్రమాణాలకనుగుణంగా 27 రకాల పరీక్షలను చేస్తున్నట్లు వెల్లడించింది. హైదరాబాద్లో అధికంగా కార్యకలాపాలు నిర్వహిస్తోన్న సిద్స్ ఫార్మ్ ఇప్పుడు తమ పాలలో హార్మోన్లు, నిల్వ రసాయనాలు, యాంటీబయాటిక్స్ లేవని మిల్లీనియల్ తరానికి భరోసా అందిస్తున్నది.
ఈ బ్రాండ్కు 100కు పైగా స్టోర్లుఉండటంతో పాటు బిగ్బాస్కెట్, అమెజాన్, ఫ్లిప్కార్ట్ తదితర ఈ–కామర్స్ వేదికల ద్వారా కూడా కార్యకలాపాలు నిర్వహిస్తున్నది.‘‘ఈ పరీక్షలను అత్యాధునిక సదుపాయాలలో చేస్తున్నాం. తద్వారా పాల డెలివరీ వరకూ ఎలాంటి హార్మోన్లు, నిల్వకారకాలు ఉండవని నిర్ధారిస్తున్నాముని’ సిద్స్ ఫార్మ్ ఫౌండర్, సీఈవో డాక్టర్ కిశోర్ ఇందుకూరి తెలిపారు.