మెదక్, జనవరి 18 : ఒమిక్రాన్ విస్తరిస్తున్న నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ సూచించారు. మంగళవారం కలెక్టరేట్లోని అడిటోరియంలో మెప్మా, రిసోర్స్ పర్సన్స్తో మెప్మా కార్యాకలాపాలు, బ్యాంక్ లింకేజీ అంశాలపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలో మొదటి విడుతగా వంద శాతం కొవిడ్ టీకా వేశామని, రెండో విడుతను ఈ నెలాఖరులోగా పూర్తి చేస్తామన్నారు. ఈ సందర్భంగా మెప్మా రిసోర్స్ పర్సన్లకు శానిటైజర్, మాస్క్ల కిట్లను ఆమె అందజేశారు. ఈ కార్యక్రమంలో నాబార్డు ఏజీఎం. సెసిల్ తిమోతీ, లీడ్ బ్యాంక్ మేనేజర్ వేణుగోపాల్రావు, అర్బన్ డీఏంసీ ప్రాజెక్ట్ డైరక్టర్ ఇందిరా మేరి, మెప్మాయా టీఏంసీ సునీత సిబ్బంది పాల్గొన్నారు.
సిబ్బందికి బూస్టర్ టీకాలు
తూప్రాన్/రామాయంపేట, జనవరి 18 : తూప్రాన్ ప్రభుత్వ దవాఖానలోని ఇప్పటి వరకు మూడు రోజుల్లో వైద్య ఆరోగ్య, ఇతరులు 278 మందికి బూస్టర్ టీకాలను ఇచ్చామని తూప్రాన్ వైద్య ఆరోగ్య శాఖ డాక్టర్ ఆనంద్ తెలిపారు. మంగళవారం ప్రభుత్వ దవాఖానలో వైద్య సిబ్బందితో పాటు ఫ్రంట్లైన్ వారియర్స్కు టీకాలు వేశారు. 15 నుంచి 18 ఏండ్ల లోపు యువతీ, యువకులకు 2784 మంది దాదాపు 91శాతం వారికి వ్యాక్సిన్ టీకాలు ఇచ్చామని వెల్ల డించారు. తూప్రాన్ మండల వ్యాప్తంగా మొద టి డోస్ మొత్తం 54751, రెండో డోస్ 47514 మందికి టీకాలు ఇచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీహెచ్ఎస్ కృ ష్ణ, శారద, సీహెచ్వో బాల నర్సయ్య, ఎంపీహెచ్ఎస్ పల్లవి ఏఎన్ఎంలు ఉన్నారు.
మాస్కు ధరించని వారికి జరిమానా..
వెల్దుర్తి, జనవరి 18 : కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా ప్రతి ఒక్కరూ మాస్కులను తప్పనిసరిగా ధరించాలని వెల్దుర్తి ఎస్సై మహేందర్ తెలిపారు. మంగళవారం వెల్దుర్తిలో పోలీస్ సిబ్బంది ప్రత్యేకంగా తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్సై మహేందర్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా వ్యాప్తి విస్తరిస్తున్న నేపథ్యం లో ప్రతి ఒక్కరూ నిబంధనలను పాటించడంతో మాస్కులను ధరించాలన్నారు. సామాజిక దూరం పాటించాలని సూచించారు.