జగదేవ్పూర్ జనవరి18: సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలంలోని తీగుల్నర్సాపూర్ కొండపోచమ్మ దేవాలయం వేలాది మంది భక్తులతో జనసంద్రం గా మారింది. జాతర రెం డోరోజూ మంగళవారం అమ్మవారిని దర్శించుకునేందుకు వేల సం ఖ్యలో భక్తులు తరలి రావడంతో క్యూలైన్లు కిక్కిరిసిపోయా యి. కమా న్ ప్రాంతం నుంచి ఆలయం వరకు భక్తులు బోనాలు ఎత్తుకొని జై కొండపోచమ్మ అంటూ చేరుకున్నారు. భక్తిశ్రద్ధలతో అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. కొమురవెల్లి మల్లన్నను దర్శించుకున్న భక్తులు సోమవారం నుంచి పెద్ద సం ఖ్యలో కొండపోచమ్మకు చేరుకున్నారు.
ఆకట్టుకున్న విన్యాసాలు..
కొండపోచమ్మ జాతరకు వచ్చిన భక్తులు తాము కోరిన కోరికలు తీరడంతో ముందుగా ఆలయం ఎదుట ఉన్న చెరువులో స్నానం ఆచరిస్తారు. ఆలయ పరిసరాల్లో అమ్మవారికి నైవేద్యం వండి రంగురంగులు పూలతో అలంకరించిన బోనా లు సమర్పిస్తారు. శివసత్తుల పూనకాలు, యువతీ యువకుల నృత్యా లు ఆకట్టుకున్నాయి. ఊరేగింపుగా బోనాలను తీసుకొచ్చి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి అమ్మవారికి ఒడిబియ్యం, నైవేద్యం సమర్పించారు. హైదరాబాద్తోపాటు చుట్టుపక్కల ప్రా ంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న చెట్టుకు ముడుపులు కట్టారు.
భక్తులకు ఏర్పాట్లు..
జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పా ట్లు చేసినట్లు ఆలయ కార్యనిర్వాహణ అధికారి మోహన్రెడ్డి, సర్పంచ్ రజితారమేశ్ తెలిపారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఏర్పాట్లు చేసి పర్యవేక్షిస్తున్నామన్నారు. ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ను కంట్రోల్ చేయడంతో పాటు అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పరిశీలిస్తున్నట్లు ఎస్సై రాజు తెలిపారు.