IND vs ENG 3rd Test : రాజ్కోట్ టెస్టులో భారత యువ బ్యాటర్ శుభ్మన్ గిల్(91) సెంచరీ చేజార్చుకున్నాడు. టామ్ హర్ట్లే బౌలింగ్లో అనూహ్యంగా రనౌటయ్యాడు. నైట్ వాచ్మన్ కుల్దీప్ యాదవ్(26) ఆడిన బంతి స్టోక్స్ వేగంగా హర్ట్లే వైపు విసిరాడు. అది గమనించిన గిల్ నాన్ స్ట్రక్వైపు పరిగెత్తాడు. కానీ, అప్పటికే బంతి అందుకున్న అతడు వికెట్లను గిరాటేశాడు.
దాంతో, గిల్ నిరాశగా పెవిలియన్ చేరాడు. మూడో రోజు సెంచరీ తర్వాత రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగిన యశస్వీ జైస్వాల్(104) క్రీజులోకి వచ్చాడు. ప్రస్తుతం టీమిండియా స్కోర్… 247/3. ప్రస్తుతానికి రోహిత్ సేన373 పరుగుల ఆధిక్యంలో ఉంది.
Shubman Gill is frustrated as he is run out in the 90s!
A composed knock from him nonetheless. He is back 👏 https://t.co/uNRzS8VZ65 | #INDvENG pic.twitter.com/HfVTCTdCwF
— ESPNcricinfo (@ESPNcricinfo) February 18, 2024
మూడో రోజు కుల్దీప్, జడేజాలు తిప్పేయగా.. సిరాజ్ నాలుగు వికెట్లతో స్టోక్స్ సేన నడ్డి విరిచాడు. ఆ దెబ్బకు ఇంగ్లండ్ 319 పరుగులకే ఆలౌటయ్యింది. తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోర్ చేసిన భారత్ రెండో ఇన్నింగ్స్లో భారీ ఆధిక్యం దిశగా సాగుతోంది. యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్(104 : 133 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసక సెంచరీకి తోడూ శుభ్మన్ గిల్(65 నాటౌట్) హాఫ్ సెంచరీ బాదడంతో భారీ స్కోర్ చేసింది. 2 వికెట్ల నష్టానికి 196 రన్స్ కొట్టింది. దాంతో, ఆట ముగిసే సరికి రోహిత్ సేన ఆధిక్యం 322 పరుగులకు చేరింది.