అమరావతి : పశ్చిమమధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం ప్రభావంతో ఏర్పడనున్న జవాద్ తుపాను తీవ్రత దృష్ట్యా ఏపీ గుండా వెళ్లే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. రేపు(సోమవారం ) బయలుదేరాల్సిన భువనేశ్వర్- సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్(17015), పూరి- తిరుపతి ఎక్స్ప్రెస్(17479), పలాస -విశాఖపట్నం (18531), కిరండోల్- విశాఖపట్నం(18552), తిరుపతి -హౌరా ఎక్స్ప్రెస్(20890), భువనేశ్వర్-విశాఖ ఎక్స్ప్రెస్(22819)రద్దు చేసినట్టు తెలిపారు.
అదే విధంగాభువనేశ్వర్ -తిరుపతి ఎక్స్ప్రెస్(22871), హౌరా-తిరుచిరాపల్లి ఎక్స్ప్రెస్(12663), భువనేశ్వర్ – బెంగళూరు ఎక్స్ప్రెస్ (12845) రైళ్లు రద్దు చేసినట్టు రైల్వేశాఖ అధికారులు వెల్లడించారు.