పీర్జాదిగూడ, ఏప్రిల్ 12: పీర్జాదిగూడ నగరపాలక సంస్థ 5వ డివిజన్ కార్పొరేటర్ స్వాతికృష్ణగౌడ్కు న్యూ లైఫ్ తీయోలాజికల్ యూనివర్సిటీ అత్యుత్తమ సేవ రత్న అవార్డు లభించింది. డివిజన్లో కొన్ని నెలల క్రితం భారీ వర్షాలకు ముంపుకు గురైన కాలనీలో స్థానిక ప్రజలకు అండగా ఉంటూ రోజుల పాటు సహాయక చర్యలను, సేవలను గుర్తించి 2021 సంవత్సరంకు గాను ఎంపిక చేశారు. మంగళవారం నగరంలోని రవీంద్ర భారతీలో యూనివర్సిటీ నిర్వహించిన కార్యక్రమంలో ఈ సేవ రత్నా అవార్డుతో పాటు, మెమోంటోను, మెడల్ను అందజేసి కార్పొరేట ర్ను శాలువాతో సత్కరించారు.
రాంపల్లిదాయరలోని బాలవికాస్ స్వచ్ఛంద సంస్థ పాఠశాల విద్యార్థులకు శానిటేజర్ స్ప్రే మిషన్, హ్యండ్వాష్ ఎలక్ట్రికల్ మిషన్, షోప్స్ కిల్డ్లను మంగళవారం బహుకరించారు. వారితో పాటు నగరానికి చెందిన ఆక్సెంచర్ సంస్థ 9, 10వ తరగతి బాలికలకు శానిటీరి కిట్స్ను సర్పంచ్ మాధురి వెంకటేశ్ చేతుల మీదుగా అందజేశారు. -కీసర