హైదరాబాద్ : రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్క్లో సెహరి సినిమా నటీ నటులు హర్ష్ కనుమిల్లి, సిమ్రాన్ చౌదరి, నిర్మాత అద్వయ జిష్ణు రెడ్డి, డైరెక్టర్ జ్ఞాన సాగర్ మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ ఎంతో అవసరమని అన్నారు. ప్రతి ఒక్కరు పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలని కోరారు.
ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటే అవకాశం లభించినందుకు సంతోషం వ్యక్తం చేశారు. మన చుట్టూ ఎల్లప్పుడూ గ్రీనరి ఉండేట్లు చూసుకోవలాని, అది మనకు ఎంతో మేలు చేస్తుందన్నారు.
అనంతరం చిత్ర హీరో హర్ష కనుమిల్లి గ్రీన్ ఇండియా చాలెంజ్లో బాగంగా అభినవ్ గోమటం, నందు, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ముగ్గురికి చాలెంజ్ విసిరారు. హీరోయిన్ సిమ్రాన్ చౌదరి మరో ముగ్గురు ప్రణీత్ రెడ్డి, నవదీప్, అభినవ్ గోమటంకి గ్రీన్ ఇండియా చాలెంజ్ విసిరారు.