అమరావతి ,జూలై :ఆంధ్రప్రదేశ్ లో పాఠశాలు పున: ప్రారంభించేందుకు సిద్దమైంది జగన్ సర్కారు. రాష్ట్రంలో స్కూల్స్ పున:ప్రారంభంపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన ఆగష్టు నుంచి స్కూల్స్ రీఓపెన్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
తేదీ ప్రకటించని మంత్రి ఆగస్టు నుంచి స్కూల్స్ ప్రారంభించేలా ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు. కరోనా సెకండ్ వేవ్ ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో విద్యార్థులందరూ రోజూ రావాల్సిన అవసరం లేదన్నారు. ఒకరోజు 50శాతం మంది.. మరొకరోజు మిగిలిన 50శాతం మంది తరగతులకు వచ్చేలా చర్చలు జరుపుతున్నామని ఆయన పేర్కొన్నారు.