హైదరాబాద్, డిసెంబర్6 (నమస్తే తెలంగాణ): దేశంలో పెరిగిన దళిత జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లను 20 శాతానికి పెం చాలని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి డిమాండ్ చేశారు. అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని ట్యాంక్బండ్ మీద ఉన్న ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. మాదిగల జేఏసీ ఆ ధ్వర్యంలో 13, 14 తేదీల్లో చలోఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు వెల్లడించారు. వాల్పోస్టర్లను ఎమ్మెల్సీ కవిత ఆవిష్కరిస్తార ని తెలిపారు. మాదిగ అనుబంధ సంఘాలన్నీ తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమం లో మాదిగ జేఏసీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు జెర్రిపోతుల సాయి, నరేశ్ పాల్గొన్నారు.