శ్రీశైలం డిసెంబర్ 26 : శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మెన్ కారా దినేష్ కుమార్ తన కుటుంబంతో సహా దర్శించుకున్నారు. ఆదివారం ఆలయ ప్రధాన గోపురం వద్దకు చేరుకున్న దినేష్ కుమార్ కుటుంబాన్ని ఈవో లవన్న అర్చక వేదపండితులుచే తిలక ధారణ చేయించి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన ఉభయ దేవాలయాల్లో స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు.
ఆ తరువాత ఈవో లవన్న అమ్మవారి ఆలయ ప్రాకారంలో వేదాశీర్వచనాలు వల్లించి తీర్థప్రసాదాలు పరిమళ విభూదితోపాటు ఙ్ఞాపికను అందజేశారు. అనంతరం దినేష్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరపున శ్రీశైల దేవస్థానానికి మహేంద్రా బొలెరా పికప్ ట్రక్ వాహనాన్ని విరాళంగా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఏపి సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ సంజయ్ సాహే, టిఎస్ సర్కిల్ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ అమిత్ జిన్ గ్రాన్, ఏపి జిఎమ్ గుండురావు, కర్నూలు,
నంద్యాల మరియు శ్రీశైలం ఎస్బిఐ మేనేజర్స్, సిబ్బంది పాల్గొన్నారు.