మహేష్బాబు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’చిత్రీకరణ పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్ను విడుదల చేశారు. ఇందులో మహేష్బాబు రౌడీ మూకల భరతం పడుతూ ఉగ్రరూపంలో కనిపిస్తున్నారు. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మే 12న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది. హైదరాబాద్లో వేసిన భారీ సెట్లో నాయకానాయికలతో పాటు డ్యాన్సర్స్ పాల్గొనగా ఓ మాస్ పాటను తెరకెక్కించామని.. దీంతో షూటింగ్ మొత్తం పూర్తయిందని చిత్రబృందం వెల్లడించింది. ఈ సినిమాలోని మూడో గీతాన్ని నేడు విడుదల చేయబోతున్నారు. కీర్తి సురేష్, వెన్నెల కిషోర్, సుబ్బరాజు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఆర్.మది, సంగీతం: తమన్, నిర్మాణ సంస్థలు: మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, 14రీల్స్ ప్లస్, సీఈఓ: చెర్రీ, నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, రచన, దర్శకత్వం: పరశురాం పెట్ల.