ముంబై: మధ్యప్రదేశ్తో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ సెంచరీతో అదరగొట్టాడు. రెండవ రోజు ఆటలో 24 ఏళ్ల సర్ఫరాజ్ చెలరేగిపోయాడు. సెంచరీ కొట్టిన తర్వాత సర్ఫరాజ్ భావోద్వేగానికి లోనయ్యాడు. ఈ సీజన్లో ఆయనకు ఇది నాలుగవ సెంచరీ. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అతనికి ఇది 8వ సెంచరీ కావడం విశేషం. సర్ఫరాజ్ సెంచరీ సంబరాలను బీసీసీఐ తన ట్విట్టర్లో షేర్ చేసింది. రెండవ రోజు 40 రన్స్ వద్ద బ్యాటింగ్ ప్రారంభించిన సర్ఫరాజ్.. 134 రన్స్ చేసి ఔటయ్యాడు. తొలి 50 పరుగుల కోసం 152 బంతులు ఆడిన సర్ఫరాజ్.. ఆ తర్వాత 38 బంతుల్లోనే మరో 50 రన్స్ చేశాడు. తొలుత టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ పృథ్వీ షా తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. యశస్వి జైస్వాల్, షాలు తొలి వికెట్కు 87 రన్స్ జోడించారు. పృథ్వీ షా 47 రన్స్ చేసి ఔటయ్యాడు. జైస్వాల్ 78 రన్స్ చేశాడు. ఇక రెండవ రోజు ఆటలో సర్ఫరాజ్ తన బ్యాటింగ్ సత్తా చూపించాడు. మధ్యప్రదేశ్ బౌలర్ గౌరవ్ యాదవ్ నాలుగు వికెట్లు తీసుకున్నాడు.
💯 for Sarfaraz Khan! 👏 👏
His 4⃣th in the @Paytm #RanjiTrophy 2021-22 season. 👍 👍
This has been a superb knock in the all-important summit clash. 👌 👌 #Final | #MPvMUM | @MumbaiCricAssoc
Follow the match ▶️ https://t.co/xwAZ13U3pP pic.twitter.com/gv7mxRRdkV
— BCCI Domestic (@BCCIdomestic) June 23, 2022