సంగారెడ్డి జిల్లాలోని ఉపాధ్యాయుల ఖాళీలు 930
ఎస్జీటీ 457, ఎస్ఏ 282..
సబ్జెక్టుల వారీగా ఖాళీలను గుర్తించిన అధికారులు
ఉద్యోగోన్నతులకు అవకాశం
భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టిన ప్రభుత్వం
సంగారెడ్డి, మార్చి 28 (నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లాలో ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలపై స్పష్టత వచ్చింది. విద్యాశాఖ పోస్టులవారీగా ఖాళీల వివరాలను సేకరించింది. విద్యాశాఖ అధికారులు సమాచారం మేరకు జిల్లాలో 930 ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పీజీహెచ్ఎం పోస్టులు 457ఖాళీగా ఉండగా ఎల్ఎఫ్ఎల్హెచ్ఎం పోస్టులు 89ఖాళీగా ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 282, ఎస్జీటీ పోస్టులు 457, లాంగ్వేజీ పండిట్ పోస్టులు 40, పీఈటీ పోస్టులు ఎనిమిది, మ్యూజిక్ టీచర్ పోస్టులు నాలుగు ఖాళీగా ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీ, లాంగ్వేజీ పండిట్, పీఈటీ తదితర పోస్టులు త్వరలో భర్తీ అయ్యే అవకాశం ఉందని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. పదోన్నతుల ద్వారా ప్రధానోపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయడం జరుగుతుందని పేర్కొంటున్నారు.
సబ్జెక్టులవారీగా ఖాళీలు గుర్తింపు
విద్యాశాఖ అధికారులు సబ్జెక్టులవారీగా సంగారెడ్డి జిల్లాలోని పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టులను గుర్తించారు. అధికారుల సమాచారం మేరకు లాంగ్వేజ్ పండిట్ పోస్టులు 40 ఖాళీ ఉండగా ఇందులో హిందీ పండిట్పోస్టులు 11, తెలుగు పండిట్పోస్టులు 24, ఉర్దూ పండిట్పోస్టులు ఐదు ఖాళీగా ఉన్నాయి. పీఈటీ పోస్టులు ఎనిమిది ఖాళీగా ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 282 ఖాళీగా ఉన్నాయి. ఇందులో స్కూల్ అసిస్టెంట్ ఫిజిక్స్ ఎడ్యుకేషన్ 10 పోస్టులు, స్కూల్ అసిస్టెంట్ బయో సైన్స్ 58, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లిషు 29, స్కూల్ అసిస్టెంట్ హిందీ 12, స్కూల్ అసిస్టెంట్స్ మ్యాథ్స్ 29, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ 21 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటితోపాటు స్కూల్ అసిస్టెంట్ సోషల్ పోస్టులు 94, స్కూల్ అసిస్టెంట్ తెలుగు పోస్టులు 22, స్కూల్ అసిస్టెంట్ ఉర్దూ మూడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎస్జీటీ పోస్టులు 457 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో ఎస్జీటీ ఉర్దూ మీడియం పోస్టులు మూడు, కన్నడ మీడియం పోస్టులు రెండు, ఎస్జీటీ తెలుగు మీడియం పోస్టులు 301, ఎస్జీటీ ఉర్దూ మీడియం పోస్టులు 151పోస్టులు ఖాళీగా ఉన్నాయి. త్వరలో ఆయా పోస్టులు భర్తీ అయ్యే అవకాశం ఉంది.
పీజీహెచ్ఎం : 50
ఎల్ఎఫ్ఎల్హెచ్ఎం : 89
ఎస్ఏ : 282
ఎస్జీటీ : 457
లాంగ్వేజ్పండిట్ : 40
పీఈటీ : 8
మ్యూజిక్ టీచర్స్ : 4
భాషా పండితులు, పీఈటీలకు తీపి కబురు
మెదక్ మున్సిపాలిటీ, మార్చి 28: భాషా పండితులు, వ్యాయామ ఉపాధ్యాయుల కోరిక నెరవేరనుంది. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న పోస్టుల అప్గ్రేడేషన్కు రాష్ట్రప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వారిలో ఆనందం వ్యక్తమవుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లోని ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో గ్రేడ్-2 హోదాలో పనిచేస్తున్న తెలుగు, ఉర్దూ, హిందీ భాషా పండితులు స్కూల్ అసిస్టెంట్ (గ్రేడ్-1) హోదాలోకి వెళ్లనున్నారు. అర్హులైన పీఈటీలు స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ డైరెక్టర్గా అప్గ్రేడ్ కానున్నారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు 2019లో విడుదలయ్యాయి. దీనిపై అప్పట్లో కొంత వివాదం తలెత్తడంతో అమలులో కొద్దిమేర జాప్యమైంది.
తాజాగా పండిత్, పీఈటీ పోస్టుల అప్గ్రేడేషన్లో కొన్ని సవరణలు చేస్తూ ఈ పోస్టుల్లో విధులు నిర్వహిస్తున్న వారికే ప్రయోజనం పొందేలా సూచిస్తూ శనివారం విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ ఉత్తర్వులు జారీ చేశారు. పోస్టుల అప్గ్రేడేషన్కు మోక్షం లభించింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో అప్గ్రేడేషన్ కోసం ఎదురు చూస్తున్న సుమారు 1700మంది భాషా పండితులకు ప్రయోజనం కలుగనుంది. ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం సుమారు 300మంది పీఈటీలు ఉన్నారు. వీరిలో 200మంది వరకు ప్రయోజనం చేకూరనుంది. మిగతావారికి అప్గ్రేడేషన్లో ప్రయోజనం దక్కకపోవచ్చు. బీపీఈడీ అర్హతలున్న వారు ఫిజికల్ డైరెక్టర్ అప్గ్రేడేషన్ పోస్టులోకి వెళ్లనున్నారు. వ్యాయామ విద్యలో యూజీడీ చేసి ప్రస్తుతం పీఈటీలుగా ఉన్నవారు బైగ్రేడు పోస్టుగా ఉన్నత పాఠశాలల్లో పని చేయనున్నారు.
2017లోనే హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్
న్యాయంగా తమకు దక్కాల్సిన పోస్టులను ఎస్జీటీలు పదోన్నతుల ద్వారా పొందుతున్నారని తమ పోస్టులను సైతం అప్గ్రేడ్ చేయాలని పీఈటీలు, భాషా పండితులు కొంతకాలంగా ప్రభుత్వం దృష్టికి తేవడంతో 2017లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో భాషా పండితులతోపాటు, పీఈటీ పోస్టులను సైతం అప్గ్రేడ్ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. అప్పటి హామీ ఈ రోజు పరిష్కారం కానుండడంతో పీఈటీలు, భాషా పండితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
రోగ నిరోధక శక్తి పెంచే జ్యూస్లు ఇవే..
నిద్రకు ముందు గ్రీన్ టీ తాగితే..?