ములుగు : జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మంగపేట మండలంలోని కమలాపురం- ఏటూరునాగారం రహదారి పై ఇసుక లారీ ఢీకొట్టడంతో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ యువకుడు మృతిచెందాడు.
స్థానికుల కథనం మేరకు.. జీడి వాగు వద్ద ద్విచక్ర వాహనం పై వస్తున్న దేవేందర్ అనే యువకుడిని ఇసుక లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స కోసం దవాఖానకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తుననారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.