పాంటెవెడ్రా(స్పెయిన్) : అండర్-23 ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్షిప్లో భారత రెజ్లర్ సాజన్ భన్వాల్ చరిత్ర సృష్టించాడు. గ్రీకో రోమన్ విభాగం కాంస్య పతక పోరులో భన్వాల్ ఉక్రెయిన్కు చెందిన దిమిత్రో వసెట్స్కిని ఓడించి అండర్-23 చాంపియన్షిప్లో పతకం సాధించిన తొలి భారత రెజ్లర్గా నిలిచాడు.
ఆధిక్యం చేతులు మారుతూ వచ్చిన మ్యాచ్ 10-10తో డ్రాగా ముగిసినా చివరి పాయింట్ సాధించిన భారత రెజ్లర్ను విజేతగా ప్రకటించారు. రెపిచేజ్ పద్ధతిలో కాంస్య పతక పోరుకు అర్హత సాధించిన భన్వాల్ దానిని సద్వినియోగం చేసుకుంటూ పతకం దక్కించుకున్నాడు.