ములుగు : వన దేవతలు మేడారం సమ్మక్క, సారలమ్మలను గురువారం రెవెన్యూచ, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, అడ్వైజర్ గోవింద హరి దర్శించుకున్నారు. అమ్మవార్ల దర్శనానికి వచ్చిన వారికి కలెక్టర్ దివాకరతో పాటు పూజారులు, దేవదాయ శాఖ ఈవో వీరస్వామిలు ఘనంగా స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా అమ్మవార్లకు గిరిజన సంప్రదాయ పద్ధతులను ప్రత్యేక పూజలు నిర్వహించి మోక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మేడారంలోని ఐటీడీఏ క్యాంపు కార్యాలయంలో 2026 జనవరి 28 నుంచి జరిగే అమ్మవార్ల మహా జాతరలో భక్తుల సౌకర్యార్థం చేపట్టాల్సిన సౌకర్యాలు పై వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.