అమరచింత, జూన్ 29 : ప్రత్యేక రాష్ట్ర సాధన మలిదశ ఉద్యమంలో తన గళం వినిపించి ప్రజలను ఏకంగా చేసిన సాయిచంద్కు మరణం లేదని, ఆయన ప్రజల గుండెల్లో సజీవంగానే ఉన్నాడని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ పేర్కొన్నారు. సోమవారం వనపర్తి జిల్లా అమరచింతలో ప్రజాగాయకుడు సాయిచంద్ మూడో వర్ధంతి సభను బీఆర్ఎస్ ఆధ్యర్యంలో నిర్వహించారు. సాయిచంద్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
సాయిచంద్ సతీమణి రజిని అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ఆర్ఎస్పీ మాట్లాడుతూ తెలంగాణ బిడ్డల ఆత్మఘోషపై ఆ పరమశివుడిని తన పాటలతో ప్రశ్నించిన కళాకారుడు సాయిచంద్.. ప్రసుత్తం రేవంత్ పాలనపై మరో మారు ప్రశ్నించేవారని అన్నారు. రజినీసాయిచంద్ మాట్లాడుతూ సాయిచంద్ మూడో వర్ధంతి సందర్భంగా 100 మందికి రూ.10 లక్షల చొప్పున జీవితబీమా పాలసీని కట్టాలని నిర్ణయం తీసుకున్నామని ప్రకటించారు. టీజీ ఫుడ్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ రాజీవ్సాగర్, తదితరులు పాల్గొన్నారు.