Russia-Ukrain Conflict | ఉక్రెయిన్పై రష్యా దండయాత్ర వల్ల ప్రపంచ మానవాళిపై ప్రభావంపై ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ స్పందించారు. కేవలం ముడి చమురు, సహజవాయువుకు మాత్రమే పరిమితం కాదన్నారు. గోధుమలతోపాటు నిత్యావసర వస్తువుల సరఫరాపైన తీవ్ర ప్రభావం ఉంటుందని స్పష్టం చేశారు. ప్రపంచ దేశాలకు ఉక్రెయిన్, రష్యా గణనీయ స్థాయిలో గోధుమలు ఎగుమతి చేస్తున్నాయని తెలిపారు. తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో గోధుమలతోపాటు ఆహార ధాన్యాల ధరలు పెరగనున్నాయని హెచ్చరించారు. ప్రధాన లోహాల ఉత్పత్తిదారు రష్యా అని, ఉద్రిక్తతల వల్ల వాటి ధరలు పెరుగుతాయని స్పష్టం చేశారు.
రికవరీ కూడా రిస్కే. యావత్ ప్రపంచదేశాలు.. ముడి చమురు, యూరప్ దేశాలు చమురుతోపాటు నాచురల్ గ్యాస్ అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తుందన్నారు. ఇందులో సహజవాయువు ఉత్పత్తి పరిమితంగా ఉంటుందని, అవసరమైన దేశాలకు సరఫరా కష్టతరంగా మారుతుందని రఘురామ్ రాజన్ చెప్పారు.
ఇరాన్ రంగంలోకి వస్తే ఒపెక్ దేశాల నుంచి చమురు ఉత్పత్తి పెరిగే అవకాశం ఉందని రఘురామ్ రాజన్ పేర్కొన్నారు. ఇప్పటికైతే ప్రతిరోజూ రెండు మిలియన్ల బ్యారెళ్ల ముడి చమురు ఉత్పత్తి అవుతుందని, ఇది రోజువారీ డిమాండ్కు తక్కువేనని చెప్పారు. అమెరికా ఫెడ్ రిజర్వు విధాన నిర్ణయం బ్యాలెన్సింగ్గా ఉండాలని సూచించారు.