మాస్కో: రష్యా మరోసారి ఉక్రెయిన్పై డ్రోన్లతో విరుచుకుపడింది. రాజధాని కీవ్, ఖర్కీవ్ నగరాల్లోని జనావాసాలపై భారీ స్థాయిలో డ్రోన్ల దాడి జరిగింది. రష్యాలోని సరిహద్దు నగరమైన బెల్గోరోడ్పై శుక్ర, శనివారాల్లో ఉక్రెయిన్ బలగాలు చేసిన దాడులకు ప్రతీకారంగానే ఈ చర్యకు పాల్పడినట్లు తెలుస్తున్నది. అయితే కీవ్లోని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు కొన్ని డ్రోన్లను కూల్చివేసినట్లు ఉక్రెయిన్ చెబుతోంది. ఖర్కీవ్ నగరంలో కేఫ్లు, అపార్ట్మెంట్ భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అక్కడి నగర మేయర్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు.
శుక్రవారం రష్యా దళాలు కీవ్పై క్షిపణి దాడి చేయడంతో 39 మంది మరణించారు. 160 మంది గాయపడ్డారు. ఇక ఖర్కీవ్పై శనివారం జరిపిన దాడుల్లో 19 మంది గాయపడ్డారు. అంతకుముందు రష్యాలోని సరిహద్దు నగరమైన బెల్గోరోడ్పై శుక్ర, శనివారాల్లో ఉక్రెయిన్ బలగాలు దాడులు చేశాయి. ఈ ఘటనల్లో 14 మంది మరణించారు. పలువురు గాయపడ్డారు. పలు కార్లు మంటల్లో కాలిపోయాయి. 32 ఉక్రెయిన్ డ్రోన్లను కూల్చేశామని రష్యా అధికారులు ప్రకటించారు.