శ్రీశైలం : భక్తులతో శ్రీశైల మహాక్షేత్రంలో భక్తుల సందడి నెలకొన్నది. శ్రావణమాసం కావడంతో భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి వారలను దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. శనివారం తెల్లవారుజాము నుంచి భక్తులకు సర్వదర్శనాలు కల్పించినట్లు ఈవో లవన్న తెలిపారు. వరుస సెలవు దినాలుకావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో.. స్వామివారి గర్భాలయ అభిషేకాలు, సర్శదర్శనాలు. అమ్మవారి శ్రీచక్ర కుంకుమార్చనలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ఆలయ దర్శనార్థం వస్తున్న భక్తులు సైతం దేవస్థాన సిబ్బందితో సహకరించాలని ఈవో కొరారు.