TSRTC | హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ జోన్ పరిధిలో ఉన్నటువంటి మనోహరాబాద్ మండల కార్యాలయంలో ఈ నెల 30న దివ్యాంగుల బస్సు పాస్ల స్పెషల్ క్యాంప్ మేళాను నిర్వహిస్తామని గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వి. వెంకటేశ్వర్లు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గురువారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దివ్యాంగులకు బస్సు పాసులు జారీ చేస్తామని ఆయన తెలిపారు.
మనోహరాబాద్, పాలాట, ధర్మరాజపల్లి, కునాయిపల్లి, కూచారం, పోతారం, జీడిపల్లె, దండుపల్లి, లింగారెడ్డి పేట్, చాట్ల గౌరారం, కొండాపూర్, పరికి బండ, రామాయపల్లి, రంగాయిపల్లి, ముప్పిరెడ్డిపల్లి, ఆగ్రహారం తదితర పరిసర ప్రాంతాల్లో నివసించే దివ్యాంగులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. దివ్యాంగులు వారితో పాటు ఒక పాస్ఫొటో, సదరం సర్టిఫికెట్, ఆధార్కార్డ్, ఐడీ కార్డు, సర్వీస్ ఛార్జ్ రూ.50 తీసుకురావాల్సి ఉంటుందని వివరించారు.