యాదాద్రి, నవంబర్ 25: యాదాద్రీశుడి దివ్య విమానగోపురం బంగారు తాపడానికి విరాళాలు అందించేందుకు మేము సైతం అంటూ భక్తులు, ప్రజాప్రతినిధులు, నాయకులు ముందుకొస్తున్నారు. గురువారం హైదరాబాద్లోని కూకట్పల్లికి చెందిన ఎం పురోహిత్-ప్రదీప్త దంపతులు రూ.5 లక్షలు, భువనగిరి మండలం వడాయిగూడెం సర్పంచ్ గుండు మనీశ్గౌడ్ – సంతోషిణి, గుండు ముత్తయ్య – రాధ దంపతులు లక్షా 116 రూపాయల చొప్పున చెక్కులను ఆలయ ఈవో ఎన్ గీతకు అందజేశారు