సిద్దిపేట/యాదాద్రి, నవంబర్ 19: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ విమాన గోపురం స్వర్ణతాపడానికి భక్తుల నుంచి విరాళాలు వెల్లువలా వస్తున్నాయి. శుక్రవారం టీఆర్ఎస్ యువజన నాయకుడు తీపిరెడ్డి మహేశ్రెడ్డి తులం బంగారాన్ని సిద్దిపేటలో మంత్రి హరీశ్రావుకు అందజేశారు.
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం కాచారం గ్రామానికి చెందిన ప్రైవేట్ పీఈటీల సంఘం జిల్లా అధ్యక్షుడు బీబీనగరం లక్ష్మయ్య-మమత దంపతులు రూ.50 వేల విరాళం అందజేశారు. శుక్రవారం యాదాద్రిలో ఆలయ ఈవో ఎన్ గీత, అనువంశిక ధర్మకర్త బీ నరసింహమూర్తికి చెక్కు అందజేశారు.
యాదాద్రి, నవంబర్ 19 : యాదాద్రీశుడి నూతన గర్భాలయ విమానగోపురం స్వర్ణతాపడానికి ఈనెల ఒకటి నుంచి ఏడో తేదీ వరకు రూ.30,00,511 విరాళాలు స్వామివారి ఖాతాలో జమ అయినట్టు ఆలయ అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. భక్తులు చలాన్ల ద్వారా రూ.8,06,960, ఆర్టీజీఎస్ నెఫ్ట్, క్యూఆర్ కోడ్, ఆన్లైన్ల ద్వారా రూ.17,76,203, చెక్కులు, డీడీల ద్వారా రూ.4,17,348 విరాళాలు అందినట్టు వారు పేర్కొన్నారు.