న్యూఢిల్లీ, మార్చి 26: ఇంధన ధరల పెంపు కొనసాగుతున్నది. లీటర్ పెట్రోల్పై మరో 89 పైసలు, డీజిల్పై 86 పైసల చొప్పున పెంచుతూ చమురు కంపెనీలు శనివారం నిర్ణయం తీసుకున్నాయి. తాజా పెంపుతో హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ. 111.80కి పెరగ్గా, డీజిల్ రూ. 98.10కి చేరింది. ఐదు రోజుల్లో నాలుగుసార్లు పెట్రో ధరలను పెంచిన కేంద్రం.. పెట్రోల్పై మొత్తంగా రూ.3.60, డీజిల్పై రూ.3.48 పెంచింది. ఇంధన ధరల పెంపునకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ‘మెహంగాయే-ముక్త్ భారత్ అభియాన్’ పేరుతో ఈనెల 31 నుంచి ఏప్రిల్ 7 వరకు దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించింది. 31న ఉదయం 11 గంటలకు ప్రజలు, పార్టీ కార్యకర్తలు తమ ఇండ్ల ముందు, బహిరంగ ప్రదేశాల్లో గ్యాస్ సిలిండర్లు ప్రదర్శించడంతో పాటు డప్పులు కొడుతూ గంటలు మోగించాలని ఆ పార్టీ పిలుపునిచ్చింది.