యాదాద్రి, నవంబర్ 27: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి విమాన గోపురం స్వర్ణతాపడానికి పలువురు దాతలు స్వచ్ఛందంగా విరాళాలు అందజేస్తున్నారు. శనివారం వరంగల్కు చెందిన శ్రీరామ్ శామమూర్తి-సరస్వతి దంపతులు రూ.1,00,166, భువనగిరికి చెందిన హైకోర్టు న్యాయవాది ఆకుల యుగేంధర్ పటేల్ రూ.52,116 స్వామివారికి సమర్పించారు. ఆలయానికి చెల్లించిన నగదుకు సంబంధించిన రసీదులను ఆలయ ఉప కార్యనిర్వహణాధికారి గజవెల్లి రమేశ్బాబుకు అందజేశారు.