సూర్యాపేట : విద్యారంగంలో ముఖ్యమంత్రి కేసీఆర్(Chief Minister KCR) తీసుకువచ్చిన మార్పులవల్ల తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి
(Minister Jagadish Reddy) అన్నారు. పీఆర్టీయూ నల్లగొండ జిల్లా(Nallagonda ) నూతన కార్యవర్గాన్ని ఆదివారం మంత్రి అభినందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ నేతృత్వంలో విద్యారంగం(Education) బలోపేతం అయిందని దీంతో గురుకులాలకు డిమాండ్ పెరిగిందన్నారు. సమాజానికి దిక్సూచి ఉపాధ్యాయుడని విద్యావంతుల తయారీలో వారి పాత్ర ఎనలేనిది అని కొనియాడారు. రాష్ట్రంలో విద్యారంగం మరింత అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వ ఉపాధ్యాయులు మరింత శ్రమించాలని కోరారు.
ఈ సందర్భంగా నల్లగొండ జిల్లా నూతన పీఆర్టీయూ కమిటీని మంత్రి ఘనంగా సన్మానించారు. కార్యక్రమం లో పీఆర్టీయూ నల్లగొండ జిల్లా నూతన అధ్యక్షులు డీ.వి .ఎస్ ఫణికుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి కాళం నారాయణరెడ్డి, సూర్యాపేట జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జ్యోతుల చంద్రశేఖర్, రామలింగారెడ్డి, మాజీ సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి తంగెళ్ళ జితేందర్ రెడ్డి, పీ.ఎం.టీ.ఏ రాష్ట్ర అధ్యక్షులు తరాల జగదీష్, నల్లగొండ జిల్లా గౌరవాధ్యక్షులు ఓరుగంటి శ్రీనివాసులు, రాష్ట్ర పీఆర్టీయూ పత్రిక సంపాదకవర్గ సభ్యులు నర్సింహ నాయక్ తదితరులు పాల్గొన్నారు.