ముంబై: ఐపీఎల్లో రోహిత్ శర్మ భారీ మూల్యం చెల్లించుకునే అవకాశాలు ఉన్నాయి. ముంబై ఇండియన్స్ కెప్టెన్ ఒక మ్యాచ్ నిషేధం ఎదుర్కొనే ఛాన్సు ఉంది. బుధవారం పంజాబ్తో జరిగిన మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ వల్ల రోహిత్కు జరిమానా విధించారు. అతనికిఇ 24 లక్షల ఫైన్ వేశారు. ఆ జట్టులోని మిగితా ఆటగాళ్లకు కూడా 6 లక్షల జరిమానా వేశారు. 20 ఓవర్లను నిర్ణీత సమయంలో పూర్తి చేయలేని కారణంగా రోహిత్కు ఫైన్ వేశారు. ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లోనూ అతనికి 12 లక్షల జరిమానా పడింది. ఒకవేళ మూడోసారి కూడా ముంబై జట్టు స్లో ఓవర్ రేట్తో బౌలింగ్ చేస్తే అప్పుడు రోహిత్కు 30 లక్షల జరిమానా విధించనున్నారు. అంతేకాదు తాజా ఐపీఎల్ రూల్స్ ప్రకారం అతనిపై ఒక మ్యాచ్ నిషేధాన్ని విధించే అవకాశాలు కూడా ఉన్నాయి. బుధవారం జరిగిన మ్యాచ్లో ముంబై జట్టు 12 రన్స్ తేడాతో పంజాబ్ చేతిలో ఓడిపోయింది.