Rohit Sharma : శ్రీలంకతో తొలి వన్డేలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీతో రాణించాడు. ఆ ఇన్నింగ్స్ను అతను ఎవరికి అంకితం చేశాడో తెలుసా..? తన పెంపుడు కుక్కకు. అవును.. 50 పరుగులకు చేరుకోగానే రోహిత్ ఆకాశంకేసి చూస్తూ ‘మ్యాజిక్’ అని అన్నాడు. మ్యాజిక్.. అనేది అతని పెంపుడు కుక్క పేరు. విషయం ఏంటంటే.. సోమవారం (జనవరి 9న) మ్యాజిక్ చనిపోయింది. దాంతో, తనకు ఎంతో ఇష్టమైన పెట్కు హిట్మ్యాన్ తన హాఫ్ సెంచరీని అంకితం చేశాడు. ఈరోజు ఉదయం రోహిత్ భార్య రితికా ‘మాకు నిన్న చాలా కష్టమైన రోజు’ అని సోషల్మీడియాలో పోస్ట్ పెట్టింది.
గాయం నుంచి కోలుకున్న తర్వాత మొదటి మ్యాచ్లోనే అడుతున్న రోహిత్ అర్థ సెంచరీ(83)తో మెరిశాడు. 67 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మరో ఓపెనర్ శుభ్మన్ గిల్తో కలిసి తొలి వికెట్కు 143 పరుగులు జోడించాడు. విరాట్ కోహ్లీ శతకం బాదడంతో భారత్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 373 రన్స్ చేసింది.