ఆత్మకూరు, ఫిబ్రవరి 20: పట్టణంలోని రెండు వైన్స్ షాపుల్లో ఆదివారం అర్ధరాత్రి దాటాక చోరీ జరిగింది. స్థానిక చెరువుకట్ట సమీపంలోని భైరీ వైన్స్, లక్ష్మి వైన్స్ షాపు ల్లో నిందితుడు వెంటిలేటర్కు కన్నం పెట్టి చోరీకి పాల్పడ్డాడు. ముందుగా భైరీ వైన్స్లోకి ప్రవేశించిన నిందితుడు కౌంటర్లోని డబ్బులు తీసుకొని పక్కనే ఉన్నటువంటి మరో వైన్స్లోకి సైతం గొడకు కన్నంపెట్టి లోపలికి దూరి కౌంటర్లోని డబ్బులు కాజేశాడు. రెండు షాపుల్లోనూ అంచనా ప్రకారం ఒక షాపులో రూ. 30 వేలు, మరో షాపులో రూ. 40 వేలు అపహరించుకెళ్లినట్లు తెలుస్తుంది.
దాదాపు రాత్రి వేళ వరకు జరిగిన వ్యాపారం డబ్బులన్నీ యజమానులు తీసుకెళ్లగా షాపు మూతబడే సమయంలో జరిగిన వ్యాపారం డబ్బులు మాత్రమే కౌంటర్లో ఉన్నట్లు షాపు నిర్వాహకులు తెలిపారు. దీంతో నిందితుడు షాపుపై పక్కా పథకం వేసి దొంగతనానికి పాల్పడినట్లు తెలుస్తుంది. సోమవారం ఉదయమే గుర్తించిన షాపు యజమానులు పోలీసులకు సమాచారమందించారు. షాపులో రికార్డయిన సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు నిందితుడిని గుర్తించి గాలించే పనిలో ఉన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎసై మహేశ్గౌడ్ తెలిపారు. సీసీ కెమెరా ఆధారంగా బయటపడ్డ నిందితుడి చిత్రం ఇక్కడి వ్యక్తిగా కనబడడం లేదని స్థానికులు చెబుతున్నారు. నిందితు డు ఎక్కడ కనిపించినా తమకు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరుతున్నారు.