హిమాయత్నగర్, ఆగస్టు 26: ఆగంతకులు ఓ యువకుడిపై కత్తితో దాడి.. అతడి సెల్ఫోన్ లాక్కొని పారిపోయారు. నారాయణగూడ డీఎస్సై వెంకటేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. చిక్కడపల్లి, బాపునగర్లో నివాసముంటున్న దొంతుల రాకేశ్కుమార్(19) శుక్రవారం తెల్లవారుజామున నారాయణగూడ ైఫ్లైఓవర్ కింద నుంచి ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా, వెనుక నుంచి ద్విచక్ర వాహనంపై వచ్చిన ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు అడ్డగించి.. సెల్ఫోన్ ఇవ్వాలని బెదిరించారు. అతడు నిరాకరించడంతో కత్తితో గొంతుపై పొడిచి.. రూ.11 వేల విలువైన ఫోన్ను తీసుకొని ఉడాయించారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.