అచ్చంపేట, మార్చి 24 : చమురు, గ్యాస్ ధరలు పెంచడం తో కేంద్రానికి మహిళల ఉసురు తగులుతుందని టీఆర్ఎ స్ నాగర్కర్నూల్ జిల్లా అధ్యక్షుడు, విప్ గువ్వల బాలరాజు పేర్కొన్నారు. గురువారం అచ్చంపేట క్యాంపు కార్యాలయం నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు మ హిళలతో కలిసి ర్యాలీ చేపట్టారు. అంబేద్కర్ చౌర స్తా వద్ద సిలిండర్ కుండలతో నిరసన తెలిపి.. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ బీజేపీని గద్దె దించేవరకు పోరాటాలు కొనసాగిస్తామన్నారు. ప్రజలకు ఇన్ని ఇబ్బందులు గురిచేస్తున్నా.. కాంగ్రెస్ తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుందన్నారు. నిరసన కార్యక్రమాలు నిర్వహించలేని స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉందన్నారు. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తున్నారనే భయంతో.. బీజేపీ ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపుతున్నదన్నారు. వరిని కొనకుండా రై తులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుందన్నారు. బీజేపీ అవలంభిస్తున్న విధానాన్ని ఎండగట్టి దోషిగా నిలబెడుతామన్నారు. కేంద్రం చేస్తున్న పెత్తందారి విధానాలు ఎండగట్టేందుకు సీఎం కేసీఆర్ కంకణం కట్టుకున్నారన్నారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు మనోహర్, మున్సిపల్ చైర్మన్ నర్సింహగౌడ్, బల్మూర్ ఎంపీపీ అరుణ, మార్కెట్ కమిటీ చై ర్మన్ సీఎంరెడ్డి, వైస్ చైర్మన్ గోపాల్నాయక్, జెడ్పీటీసీ రాం బాబు, నాయకులు రమేశ్, రాజేశ్వర్రెడ్డి, చంద్రమోహన్, విష్ణువర్ధన్రెడ్డి, హుస్సేన్, రవి, రమేశ్రావు, కుతుబుద్దీన్, శ్రీ రాం, సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.
భూత్పూర్, మార్చి 24 : కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించేవరకు ఆందోళన చేపడుతామని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌ డ్ తెలిపారు. గురువారం భూత్పూర్లోని చౌరస్తాలో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి సమక్షంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉత్తరాది ఎన్నికలు ముగిసిన వెంటనే నాలు గు నెలలుగా స్తబ్ధుగా ఉన్న చమురు, గ్యాస్ ధరలను పెం చడం సరికాదని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పే దల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తుంటే.. పీ ఎం మోదీ నడ్డి విరిచే ప్రయత్నం చేస్తున్నారన్నారు. మంత్రి, ఎమ్మెల్యే ఎడ్ల బండిపై ఎక్కి నిరసన తెలిపారు. జెడ్పీ చైర్ పర్సన్ స్వర్ణసుధాకర్రెడ్డి, ఎమ్మెల్యే ఆల ఆటోకు తాడు కట్టి లాగారు. ఎమ్మెల్యే ఆల కిలోమీటర్ మేర సైకిల్ తొక్కారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బస్వరాజ్గౌడ్, ఎంపీపీలు శేఖర్రెడ్డి, నాగార్జునరెడ్డి, హర్షవర్ధన్రెడ్డి, రమ, జె డ్పీటీసీలు ఇంద్రయ్యసాగర్, రాజేశ్వరి, సింగిల్విండో చైర్మన్ అశోక్రెడ్డి, నాయకులు నర్సింహారెడ్డి, లక్ష్మీనర్సింహ, సత్యనారాయణ, నారాయణగౌడ్, మురళీధర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
వీపనగండ్ల, మార్చి 24 : అడ్డూ అదుపు లేకుండా గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలను పెంచుతున్న కేం ద్రం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలని ఎమ్మె ల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి పిలుపునిచ్చారు. ధరల పెంపునకు వ్యతిరేకంగా చిన్నంబావి మండల కేం ద్రంలో రాస్తారోకో నిర్వహించారు. కేంద్ర ప్రభు త్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఎడ్లకు కారును తాడు కట్టి లాగారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్రం ధరలు పెంచి ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నదన్నారు. ప్రజా సంక్షేమాన్ని వదిలేసి కార్పొరేట్ల ఖజానాను నింపడ మే లక్ష్యంగా ముందుకు సాగుతున్నదని మండిపడ్డారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ న రేందర్రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షులు సత్యనారాయణగౌడ్, ఈదన్న, వెంకటయ్య, రాజ్యగౌడ్, జెడ్పీటీసీలు మాధురి, వెంకటరామమ్మ, శేఖర్నాయక్, ఎం పీపీలు సోమేశ్వరమ్మ, కమలేశ్వర్రావు, రైతుబంధు స మితి మండలాధ్యక్షులు కృష్ణయ్య, నిరంజన్, జగదీశ్వర్రావు, నాయకులు విష్ణువర్ధన్రెడ్డి, గోవింద్, శ్రీధర్రె డ్డి, చిన్నారెడ్డి, భాస్కర్రెడ్డి, శేఖర్యాదవ్ పాల్గొన్నారు.
జడ్చర్ల టౌన్, మార్చి 24 : కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచుతూ పేదల నెత్తిన భారం మో పుతున్నదని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. ధరల పెంపునకు నిరసనగా గురువా రం జడ్చర్లలోని గాంధీ చౌరస్తా వద్ద టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శించారు. గ్యాస్ సిలిండర్లను రోడ్డుపై పెట్టి మహిళలు, నాయకులు రోడ్డుపై బైఠాయించారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పెట్రోల్, డీజీల్ ధరల పెంపుతో సాధారణ రవాణా వ్యవస్థ నిలిచిపోతుందన్నారు. నిత్యావసర సరుకుల ధరలపై ప్రభావం పడుతుందన్నారు. ఆటోలు, బైక్లు కూడా నడుపుకోలేని పరిస్థితి వచ్చిందన్నారు. సిలిం డర్ల ధరలు పెంచి పేదల నడ్డీ విరుస్తుందన్నారు.
ఐదు రాష్ర్టాల్లో ఎన్నికలు పూర్తయిన వెంటనే ధరలు పెంచడం మొదలెట్టిందన్నారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి, సంగీత, నాటక అకాడమీ మాజీ చైర్మన్ బాద్మి శివకుమార్, సర్పంచుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రణీల్చందర్, డీసీఎంఎస్ చైర్మన్ ప్రభాకర్రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వాల్యానాయక్, కౌన్సిలర్లు, సర్పంచులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మహబూబ్నగర్, మార్చి 24 : మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన మోడీ సర్కార్.. ప్రజల పాలిట శనిలా దాపురించిందని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ మండిపడ్డారు. గురువారం సీఎం కేసీఆర్ పిలుపు మేరకు జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల ను తగ్గించాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. గ్యాస్ సిలిండర్లతో నిరసన తెలిపి.. కట్టెల పొయ్యిపై మహిళలు వంట చేశారు. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను మంత్రి శ్రీనివాస్గౌడ్ సమక్షంలో దహనం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరికి చరమగీతం పాడాలన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలకు ముగింపు పలకాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను దేశ వ్యాప్తంగా ప్రజలు కోరుకుంటున్నారని తెలిపా రు. కులమతాలను రెచ్చగొడుతూ పబ్బం గడుపుకుంటున్నదన్నా రు. ధరలను తగ్గించే వరకు ఉద్యమం ఆపేదిలేదని స్పష్టం చేశా రు. వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టాలని కుట్రలు పన్నుతున్నదన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ గ్రా మాలు, మండలాల వారీగా పీఏసీసీఎస్, రైతుబంధు కమిటీలు ఏకగ్రీవ తీర్మానం చేసిన ప్రతులను పీఎం కార్యాలయానికి పంపించాలన్నారు. సీఎం కేసీఆర్ భవిష్యత్లో ఢిల్లీ కార్యక్రమానికి పిలుపునిస్తే మహబూబ్నగర్ నుం చి లక్షలాది మంది తరలివెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్రెడ్డి, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్గౌడ్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్యాదవ్, శాట్ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, డీసీసీబీ వైస్ చైర్మన్ వెంకటయ్య, గొర్రెల కా పరుల సంఘం జిల్లా అధ్యక్షుడు శాంతయ్యయాదవ్, మార్కెట్ కమిటీ మా జీ చైర్మన్ రాజేశ్వర్, కౌన్సిలర్లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకు లు పాల్గొన్నారు.