హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1994 నుంచి 2004 వరకు నాటి సీఎం చంద్రబాబునాయుడు అనేక పెట్టుబడులను ఆకర్షించారని సీఎం రేవంత్ కొనియాడారు. శుక్రవారం సీఐఐ ప్రతినిధుల సమావేశంలో ఆ యన మాట్లాడుతూ.. బిల్గేట్స్, బిల్ క్లింటన్లాంటి అనేక దిగ్గజాలను హైదరాబాద్కు తీసుకొచ్చిన ఘనత చంద్రబాబుదే అని ప్రశంసించారు. పోర్టులకు అనుసంధానంగా రహదారులను అభివృద్ధి చేస్తామని చెప్పారు. భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి మచిలీపట్నం పోర్టు వరకు 12 లేన్ల రహదారి నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. 2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ పాలన సాగించిందని, గత పాలకులు తీసుకొచ్చిన కొన్ని మంచి విధానాలు కొనసాగిస్తూనే కొత్త విధానాలను అమలు చేస్తున్నామని తెలిపారు.
స్కిల్ యూనివర్సిటీలో రిసెర్చ్ సెంటర్ ఏర్పాటుచేయాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. ఇంజినీరింగ్ కాలేజీల్లోని విద్యార్థులకు ఇంటర్న్షిప్ సౌకర్యం కల్పించాలని పేర్కొన్నారు. శుశ్రవారం శక్తి శాఖ (కార్మికశాఖ)పై మంత్రి వివేక్ వెంకటస్వామితో కలిసి నిర్వహించిన సమావేశంలో సీఎం మాట్లాడుతూ.. స్కిల్ వర్సిటీలో విదేశీ భాషలు నేర్పేందుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటుచేయాలని ఆదేశించారు. పాస్పోర్టు పొందడం నుంచి ఉద్యోగం పొందే వరకు టామ్కామ్ బాధ్యత వహించాలని సూచించారు.