హైదరాబాద్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ నకిలీ సోషల్ మీడియా ఖాతాలను సృష్టించి ప్రతిపక్షాలపై అసత్య ప్రచారాలు, దుర్మార్గమైన దాడులకు పాల్పడటం అత్యంత హేయమైన చర్య అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కొప్పుల ఈశ్వర్ కాంగ్రెస్ స్వయంగా నడిపిస్తున్న సంధ్యారావు అనే ఫేక్ అకౌంట్ పోస్టు ను ఆధారంగా చేసుకొని, స్వయంగా సీఎం రేవంత్రెడ్డి పవిత్రమైన శాసనసభ వేదికగా మాట్లాడటం ఆయన నైతిక దిగజారుడుతనానికి, రాష్ట్రంలో దాపురించిన దౌర్భాగ్య పాలనకు నిదర్శనమని మండిపడ్డారు. ఒక నకిలీ ఖాతా ఆధారంగా ఉద్యోగ నియామకాలు, ఇతర కీలక అంశాలపై చట్టసభను, యా వత్ తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించినందుకు సీఎం రేవంత్రెడ్డి తక్షణమే సభకు, ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ప్రతిపక్షాలపై బురదజల్లడమే లక్ష్యం
ప్రజలు ఎదురొంటున్న సమస్యల ను గాలికొదిలేసి, ఫేక్ అకౌంట్లతో ప్రతిపక్షాలపై బురదజల్లడమే లక్ష్యంగా కాం గ్రెస్ ప్రభుత్వం పనిచేస్తున్నదని కొప్పు ల ఈశ్వర్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగం ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ ఫేక్ అకౌంట్ల ముఠాపై పోలీసుశాఖ సమగ్ర విచారణ జరిపి, సూత్రధారులను తక్షణమే అరెస్ట్ చేయాలని కోరారు. చట్టసభ గౌరవాన్ని దిగజార్చి, తప్పుడు సమాచారంతో సభను పకదోవ పట్టించిన ముఖ్యమంత్రిపై సభాహకుల ఉల్లంఘన నోటీసు ఇవ్వాలని స్పష్టంచేశారు.