ఢిల్లీ : ఎడమ మోకాలి గాయంతో రెండు నెలల పాటు ఆటకు దూరమై బెంగళూరులోని సీవోఈలో పునరావాసం పొందుతున్న స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించాడు. త్వరలో మొదలుకానున్న అఫ్గానిస్థాన్తో టీ20 సిరీస్కు ఎంపికైనా ఫిట్నెస్ నిరూపించుకోవాలని బీసీసీఐ చెప్పడంతో తాజాగా పేసుగుర్రం ఆ టెస్టులో పాసై జట్టుతో చేరడానికి సిద్ధమయ్యాడు.
బుమ్రాతో పాటు ఆల్రౌండర్లు నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ సైతం ఫిట్నెస్ టెస్టు క్లీయర్ చేశారు. ఇక అఫ్గాన్తో సిరీస్కు జట్టులోకి ఎంపికైన పేసర్ హర్షిత్ రాణా తిరిగి గాయపడటంతో అతడి స్థానాన్ని విదర్భ పేసర్ యశ్ ఠాకూర్ భర్తీ చేయనున్నాడు.