పాట్నా, సెప్టెంబర్ 10: బీజేపీ పాలిత బీహార్లో నిర్మాణంలో ఉన్న మరో వంతెన కుప్పకూలింది. వైశాలి జిల్లాలో గురువారం కాంక్రీట్ స్లాబ్, బీమ్ లాంచర్ కూలిపోవడంతో నిర్మాణంలో ఉన్న ఒక వంతెన కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఏడుగురు కార్మికులు గాయపడ్డారు. లాల్గంజ్ ప్రాంతంలో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) ఈ వంతెనను నిర్మిస్తున్నది.
గాయపడిన కార్మికులను దవాఖానకు తరలించినట్టు జిల్లా కలెక్టర్ వర్షా సింగ్ తెలిపారు. కాగా, అవినీతి భారంతోనే వంతెన కుప్పకూలిందని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఆరోపించారు. నాసిరకం మెటీరియల్, ఎన్డీఏ నేతల అవినీతి ఈ వంతెన కూలడానికి ప్రధాన కారణాలని ఆయన విమర్శించారు.