ముంబై: ఎల్గర్ పరిషద్-మావో లింకు కేసులో ఇటీవల ప్రజాకవి వరవరరావుకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు ఆ బెయిల్కు సంబంధించిన షరతులను వెల్లడించింది. వరవరరావు ముంబైలోనే ఉండాలని బెయిల్లో స్పష్టం చేశారు. ఎటువంటి అనుమతి లేకుండా నగరాన్ని వదిలి వెళ్లరాదు. ముంబైలో అతని నివాసం వద్ద భారీ సంఖ్యలో విజిటర్లు ఉండరాదు అని కండీషన్ పెట్టారు. ఎటువంటి క్రిమినల్ కార్యకలాపాలకు పాల్పడరాదన్నారు. ఎల్గర్ కేసులో సహ నిందితులుగా ఉన్నవారితో కాంటాక్ట్లో ఉండరాదు అని బెయిల్లో షరతు పెట్టారు. ముంబైలో ఉండబోయే ఇంటి పూర్తి అడ్రస్ను సమర్పించాల్సి ఉంటుంది. అతనితో ఉండే ముగ్గురు వ్యక్తుల ఫోన్ నెంబర్లను కూడా ఇవ్వాలని కోర్టు చెప్పింది. ఎల్గర్ కేసుకు సంబంధించి మీడియాతో వరవరరావు మాట్లాడరాదు. వరవరరావు 50వేల బాండ్ సమర్పించాలని కోర్టు తెలిపింది.