హైరాబాద్/సిటీ బ్యూరో, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): సుప్రీం కోర్టు, హైకోర్టు జడ్జీలుగా ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. ఎస్సీ, ఎస్టీకి చెందిన వేల మంది సుప్రీం కోర్టు, హైకోర్టుల్లో లాయర్లుగా ప్రాక్టీస్ చేస్తున్నారని, వారికి అవకాశం కల్పించాలని కేంద్రానికి సూచించా రు. అంబేద్కర్ జయంతి సందర్భంగా గురువారం హైదరాబాద్ ట్యాంక్బండ్పై ఉన్న రాజ్యాంగ నిర్మా త విగ్రహానికి మంత్రులు కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీతో కలిసి వినోద్కుమార్ నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేం ద్రం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తుండటం వల్ల ఎస్సీ, ఎస్టీలు ఉద్యోగ, రిజర్వేషన్ అవకాశాలు కోల్పోతున్నారని చెప్పారు.
లాభాలతో నడుస్తున్న ఎల్ఐసీ, బ్యాంకులు, రైల్వే, బీఎస్ఎన్ఎల్, బీడీఎల్, పోస్టల్ తదితర సంస్థలన్నీ కనుమరుగు అవుతున్నాయని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటుపరమైతే ఎస్సీ, ఎస్టీ యువతకు ఉద్యోగాలు లభించే పరిస్థితులు ఉండవని, రిజర్వేషన్లు లేకుండా పోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. గుజరాత్కు చెందిన అం బానీ, అదానీలకు ప్రభుత్వ రంగ సంస్థలను దశల వారీగా అప్పగించేందుకు ప్రధాని మోదీ రంగం సిద్ధం చేశారని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ చేపట్టిన ఇలాంటి ప్రమాదకర చర్యలను తక్షణమే అడ్డుకోవాల్సిన ఆవశ్యకత ప్రతిఒకరిపై ఉన్నదని, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ యువత వెంటనే అప్రమత్తం కావాలని అన్నారు.
అంబేదర్ స్ఫూర్తితో ప్రతి ఒకరూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు వంటి పథకం తెలంగాణలో తప్ప ప్రపంచంలో ఎక్కడా లేదని మంత్రి కొప్పుల ఈశ్వర్ కొనియాడారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, ఆయన దూరదృష్టి కలిగిన గొప్ప మానవతావాది అని హోంమంత్రి మహమూద్ అలీ కొనియాడారు. కార్యక్రమంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే జీ సాయన్న, తెలంగాణ రాష్ట్ర మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్, రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నగేశ్, అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ వర్కింగ్ చైర్మన్లు రావుల విజయ్కుమార్, నాగారం బాబు తదితరులు పాల్గొన్నారు.