నిజాంసాగర్, మార్చి 29: కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం తక్కడపల్లి గ్రామానికి చెందిన ప్రతిభకు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అండగా నిలిచారు. పేద కుటుంబానికి చెందిన ప్రతిభ పలు క్రీడాంశాల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్నది. బాక్సింగ్, కిక్బాక్సింగ్, తైక్వాండో, వుషు, చెస్, అథ్లెటిక్స్, వెయిట్లిఫ్టింగ్లో పతకాలు సాధించింది. పల్లె నుంచి అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న ప్రతిభ.. మంగళవారం హైదరాబాద్లో స్పీకర్ను కలిసింది. ఈ సందర్భంగా యువ ప్లేయర్ ప్రతిభను గుర్తించిన స్పీకర్.. ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయం అందివ్వాలని సీఎం కేసీఆర్కు లేఖ రాశారు. పేద కుటుంబానికి చెందిన ప్లేయర్ అత్యుత్తమంగా రాణిస్తున్నందున భవిష్యత్లో మరింత ఎదగడానికి ప్రభుత్వం నుంచి సహకారం కావాలని సీఎంకు స్పీకర్ విన్నవించారు.