హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడేజ్ బెంజ్ ప్రతినిధులు.. ఐటీ కారిడార్లోని టీ హబ్ను సందర్శించారు. అత్యాధునిక టెక్నాలజీతో ఆటోమొబైల్ రంగంలో జరుగుతున్న ఆవిష్కరణలు, పలు స్టార్టప్ల వ్యవస్థాపకులతో ప్రతినిధుల బృందం ప్రత్యేకంగా సమావేశమయ్యారని టీ హబ్ ప్రతినిధి తెలిపారు.
బెంజ్నకు చెందిన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగంలోని ప్రతినిధులు.. స్టార్టప్ల నిర్వాహకులు ప్రారంభించిన ప్రాజెక్టులు, వాటి పనితీరు, ఆటో మొబైల్ రంగంలో కొత్తగా తీసుకువస్తున్న మార్పులపై ప్రధానంగా చర్చించారని తెలిపారు.