Telangana | తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరు ఐపీఎస్లు బదిలీ అయ్యారు. రామగుండం సీపీగా పనిచేస్తున్న రెమా రాజేశ్వరిని వుమెన్ సేఫ్టీ వింగ్ డీఐజీగా బదిలీ చేశారు. ఆమె స్థానంలో తెలంగాణ మల్టీ జోనల్-2 ఐజీపీగా పనిచేస్తున్న తరుణ్ జోషిని రామగుండం సీపీగా నియమించారు. ఈ మేరకు డీజీపీ రవిగుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆదేశాలు తక్షణమే అమలులోకి వస్తాయని పేర్కొన్నారు.