NEET UG | నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ యూజీ (NEET UG 2022) తొలి రౌండ్ కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ రేపటి నుంచి ప్రారంభం కానున్నది. అభ్యర్థులు mcc.nic.in వెబ్సైట్లో పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇటీవల నిర్వహించిన నీట్ యూజీ 2022 లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు మాత్రమే ఈ రౌండ్కు దరఖాస్తు చేసుకోవాలి. తొలి రౌండ్ నమోదు ప్రక్రియ ఈ నెల 17 న ముగించి, రెండో రౌండ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను వచ్చే నెల 2 నుంచి జరిపేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
నీట్ యూజీ 2022 ప్రవేశాల కోసం రేపటి నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయి. ఈ పేర్ల నమోదు ప్రక్రియ వారం రోజుల పాటు కొనసాగుతుంది. అభ్యర్థులు అక్టోబర్ 17 మధ్యాహ్నం 3 గంటల లోగా తమ ఫీజులను డిపాజిట్ చేసే అవకాశాన్ని పొందుతారు. రిజిస్ట్రేషన్ తర్వాత అక్టోబర్ 18 వరకు ఛాయిస్ ఫిల్లింగ్, లాకింగ్ చేయవచ్చు. అభ్యర్థులకు ఛాయిస్ ఫిల్లింగ్ కోసం మధ్యాహ్నం 3 గంటల వరకు, లాక్ చేయడానికి రాత్రి 11.55 గంటల వరకు సమయం ఇవ్వబడుతుంది.
కాగా, రెండవ రౌండ్ కౌన్సెలింగ్ ప్రక్రియ వచ్చే నెల 2వ తేదీ నుంచి ప్రారంభించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. నవంబర్ 18 వరకు రెండో కౌన్సెలింగ్ జరుపనున్నారు. మొదటి రెండు రౌండ్ల తర్వాత మాప్ అప్ రౌండ్ నిర్వహిస్తారు. ఈ రౌండ్లో కళాశాలల్లో అందుబాటులో ఉన్న ఏవైనా మిగిలిన సీట్లు అభ్యర్థులకు వారి ర్యాంక్, స్కోర్కార్డ్ ఆధారంగా కేటాయిస్తారు. మాప్-అప్ రౌండ్ తర్వాత కూడా ఏవైనా సీట్లు మిగిలిపోతే ఆన్లైన్ స్ట్రే వేకెన్సీ రౌండ్ నిర్వహిస్తారు. మొత్తంమీద నీట్ యూజీ కౌన్సెలింగ్ కోసం 4 రౌండ్లను నిర్వహిస్తుంటారు.