తిరుమల : కలియుగ ప్రత్యక్షదైవం ఏడుకొండల స్వామి కొలువదీరిన తిరుమల (Tirumala) లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు రెండు కంపార్టుమెంట్లలో వేచియుండగా టోకెన్లు లేని భక్తులకు 8 గంటల్లో సర్వదర్శనం(Sarvadarsan) కలుగుతుందని టీటీడీ అధికారులు పేర్కొన్నారు. నిన్న స్వామివారిని 66,915 మంది భక్తులు దర్శించుకోగా 20,784 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.87 కోట్లు వచ్చిందని వివరించారు.