వరంగల్: మిర్చి రైతుల పంట పండింది. వరంగల్ ఏనుమముల వ్యవసాయ మార్కెట్లో దేశి మిర్చికి రికార్డు ధర పలికింది. క్వింటాల్ రూ. 27 వేలతో రికార్డ్ సృష్టించింది. కాగా, మార్కెట్ చరిత్రలో మునుపెన్నడూ ఈ ధర నమోదు కాలేదని వ్యాపారులు చెబుతున్నారు. ఆరుగాలం శ్రమించిన రైతుకు రికార్డు ధర పలుకడంతో అన్నదాతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.