ఢిల్లీ ,జూన్ 4: నేవీ అండ్ డిఫెన్స్ స్టాఫ్ జాయింట్ సెక్రటరీగా రియర్ అడ్మిరల్ కపిల్ మోహన్ ధిర్ బాధ్యతలు స్వీకరించారు. ఈ బాధ్యతలు స్వీకరించిన మొట్టమొదటి ఆర్మీ ఆఫీసర్ ఈయన. అంతేకాదు పుణె, ఖడక్వాస్లాలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ పూర్వ విద్యార్థి కూడా. 1985 జనవరి 1న నౌకాదళంలో చేరారు. రియర్ అడ్మిరల్ కపిల్ మోహన్ ధిర్ మెరైన్ కమాండో (మార్కోస్) అనుభవజ్ఞుడు. ఐఎన్ఎస్ అభిమన్యు, ఐఎన్ఎస్ ఖంజర్, ఐఎన్ఎస్ రాణా ద్వారా సముద్రంపై, ఒడ్డున చేపట్టిన అనేక అసైన్మెంట్లలో పాల్గొన్నారు.
ఆపరేషన్ పవన్, ఆపరేషన్ జూపిటర్ సహా భారత్లో, వెలుపల నిర్వహించిన శాంతి పరిరక్షణ ఆపరేషన్లలోనూ సేవలు అందించారు. తూర్పు నౌకాదళం ఫ్లీట్ ఆపరేషన్స్ ఆఫీసర్గా, కోచిలో ‘ఇండియన్ నేపల్ వర్కప్ టీమ్’ ఇంఛార్జ్ కమాండర్గా ముఖ్యమైన బాధ్యతలు నిర్వర్తించారు. నౌకాదళ ప్రధాన కార్యాలయాలు, సమీకృత భద్రత బలగాల ప్రధాన కార్యాలయాల్లో వివిధ హోదాల్లో పనిచేయడం ద్వారా రక్షణ మంత్రిత్వ శాఖకు సంబంధించి రియర్ అడ్మిరల్ కపిల్ మోహన్ ధిర్కు విశేష అనుభవం ఉంది. సమీకృత భద్రత బలగాల ప్రధాన కార్యాలయంలో ఏసీఐడీఎస్గా; ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలైన ‘సులభతర వాణిజ్యం’, ‘భారత్లో తయారీ’ని ప్రోత్సహించడంలో ముఖ్య పాత్ర పోషించారు.