కేంద్ర ప్రభుత్వం యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చేస్తున్న ఉద్యమం ఉధృతమవుతున్నది. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు సోమవారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా పీఏసీఎస్లు, మార్కెట్ కమిటీలు, గ్రామపంచాయతీల్లో ఏకగ్రీవ తీర్మానాలు చేశారు. ఈ తీర్మానాల కాపీలను ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్కు పంపించినట్లు ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. పంజాబ్కు ఒక న్యాయం, తెలంగాణకు ఒక న్యాయమా అంటూ రైతులు, ప్రజాప్రతినిధులు మండిపడ్డారు. తెలంగాణపై ఇంత కక్ష సాధింపు చర్యలెందుకని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను మోసం చేసిన ఏ పార్టీ మనుగడ సాధించిన చరిత్ర లేదని హితవు పలికారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కండ్లు తెరిచి యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వంపై ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు టీఆర్ఎస్ శ్రేణులు సమాయత్తమవుతున్నాయి.
రంగారెడ్డి, మార్చి 28, (నమస్తే తెలంగాణ): రైతులు పండించే ప్రతీ గింజను కేంద్రమే కొనుగోలు చేయాలని టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు డిమాండ్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు సోమవారం జిల్లాలోని మార్కెట్ కమిటీలు, పీఏసీఎస్ల ఆధ్వర్యంలో ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్లు, పీఏసీఎస్ చైర్మెన్లు మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు చేసే వరకు కేంద్రంపై పోరాటం ఆపేదిలేదని, కేంద్రం ప్రతీ విషయం లోనూ తెలంగాణపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో పంజాబ్కు ఒక న్యాయం, తెలంగాణకు ఒక న్యాయమా అంటూ టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వానాకాలం సీజన్ నుంచి తెలంగాణ రైతాంగా నికి అన్యాయం చేసేలా కేంద్రం వ్యవహరిస్తుందన్నారు. రైతులు పంట పండించిన తర్వా త కేంద్రం తెలంగాణ రైతులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం సరైంది కాదన్నారు. అయితే నేడు డీసీసీబీ, డీసీఎంఎస్ల ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు చేయాలని డిమాం డ్ చేస్తూ తీర్మానం చేయనున్నారు. రేపు అన్ని మున్సిపాలిటీల పాలకవర్గాలు, జడ్పీ ఆధ్వ ర్యంలో కేంద్రం వంద శాతం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని తీర్మానం చేయనున్నారు.
వికారాబాద్ జిల్లాలో..
పరిగి, మార్చి 28: యాసంగిలో రైతులు పండించిన వడ్లు కేంద్రం కొనుగోలు చేయా లంటూ వికారాబాద్ జిల్లా పరిధిలోని ఊరూరా గ్రామపంచాయతీలు, పీఏసీఎస్లు, మార్కెట్ పాలకవర్గాలు తీర్మాణం చేస్తున్నాయి. రెండు రోజులుగా గ్రామపంచాయ తీలు, మండల పరిషత్, పీఏసీఎస్, మార్కెట్ కమిటీలు ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి యాసంగిలో పండించిన వడ్లు కేంద్రం కొనుగోలు చేయాలని తీర్మానాలు చేశారు. సోమ వారం సైతం వికారాబాద్ జిల్లా పరిధిలోని మార్కెట్ కమిటీలు, గ్రామ పంచాయతీలు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటుచేసి తీర్మాణాలు చేశాయి. ఈ తీర్మాణాల కాపీలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి పీయుష్ గోయెల్కు పంపించనున్నట్టు ప్రజా ప్రతినిధులు తెలిపారు.
ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కండ్లు తెరిచి రైతులు యాసంగిలో పండించిన వరి ధాన్యం ఎఫ్సీఐ ద్వారా కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఉగాది లోపు కేంద్రం తన నిర్ణయాన్ని మార్చుకోకుంటే ఆ తర్వాత ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు టీఆర్ఎస్ శ్రేణులు సమాయత్తమవుతున్నాయి. తమ ప్రాంతంలో రైతులు పండించిన వడ్లు కేంద్రం కొనుగోలు చేయాలని పరిగి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఏక గ్రీవంగా తీర్మాణించింది. మార్కెట్ చైర్మన్ ఎ.సురేందర్ అధ్యక్షతన సోమవారం మార్కెట్ కమిటీ పాలకవర్గం సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో మార్కెట్ వైస్ చైర్మన్ సమీర్, డైరెక్టర్లు పాల్గొన్నారు. పరిగి మండల పరిధిలోని గ్రామాలలో యాసంగిలో రైతులు పండించిన వడ్లను కేంద్రం కొనుగోలు చేయాలని పరిగి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పాలకవర్గ సమావేశంలో తీర్మానించారు. సోమవారం పీఏసీఎస్ చైర్మన్ కొప్పుల శ్యాంసుందర్రెడ్డి అధ్యక్షతన పీఏసీఎస్ పాలకవర్గ సమావేశం జరిగింది. సమావేశంలో పీఏసీఎస్ వైస్ చైర్మన్ ఎస్.భాస్కర్, డైరెక్టర్లు ఈశ్వరప్ప, హన్మంత్రెడ్డి, మా ణిక్యం, చరణ్రాజు, కొప్పు శ్రీను, దామోదర్రెడ్డి, రాంరెడ్డి, నర్సింహులు, సీఈవో అమరేం దర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలి
షాబాద్, మార్చి 28: యాసంగిలో రైతులు పండించిన వరిధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని షాబాద్ జడ్పీటీసీ పట్నం అవినాశ్రెడ్డి అన్నారు. సోమవారం షాబాద్ మండల కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కుమ్మరిగూడ సర్పంచ్ పోనమోని కేతన కేంద్రం వరిధాన్యం కొనుగోలు చేయాలని గ్రామ పంచాయతీ నుంచి ఏకగ్రీవ తీర్మానం చేసి జడ్పీటీసీకి అందజేశారు. కార్యక్రమంలో సర్దార్నగర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నక్క శ్రీనివాస్గౌడ్, టీఆర్ఎస్ మండలా ధ్యక్షుడు నర్సింగ్రావు, పీఏసీఏస్ చైర్మన్ చల్లా శేఖర్రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు రమేశ్ యాదవ్, మల్లారెడ్డి, కుమ్మరి శ్రీను, బుక్క రవి, రాంచందర్, భూపాల్ ఉన్నారు.
తీర్మాన పత్రం ఎమ్మెల్యేకు ఆందజేత
వికారాబాద్, మార్చి 28 : రాష్ట్రంలో పండించే వడ్లను కేంద్ర ప్రభుత్వం కొనాలని తీర్మాణ పత్రాన్ని సోమవారం వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్కు ఆయన నివాసంలో మున్సిపల్ చైర్పర్సన్ మంజుల అందజేశారు. ఇటీవల మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలో వడ్లు కొనాలని ఏక గ్రీవంగా తీర్మాణం చేశారు. తీర్మాణ పత్రాన్ని జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆనంద్కు అందజేశారు. ఆమె పాటు మున్సిపల్ వైస్ చైర్పర్సన్ శంషాద్బేగం, కౌన్సిలర్ గాయత్రీ ఉన్నారు.
కులకచర్ల చౌడాపూర్ మండలాల్లో..
కులకచర్ల, మార్చి 28 : రాష్ట్రంలో రైతులు పండించి ధాన్యాన్ని కేంద్రప్రభుత్వం కొనుగో లు చేయాలని డిమాండు చేస్తూ కులకచర్ల, చౌడాపూర్ మండలాల టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గ్రామాల నుండి తీర్మానాలు చేసి నరేంద్రమోడీకి పోస్టు ద్వారా పంపించారు. ఈ సందర్భంగా ఉమ్మడి రంగారెడ్డి డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు అనిల్రెడ్డి మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యాన్ని అన్ని కాలాల్లో కొనుగోలు చేయాలని డిమాండు చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ సత్యహరిశ్చంద్ర, జడ్పీటీసీ రాందాస్నాయక్, వైస్ ఎంపీపీ రాజశేఖర్గౌడ్, ఏఎంసీ చైర్మన్ హరికృష్ణ, టీఆర్ఎస్ పార్టీ కులకచర్ల మండల అధ్యక్షుడు శేరి రాంరెడ్డి, రైతు బంధు సమితి అధ్యక్షుడు రాజు, చాపలగూడెం సర్పంచ్ లక్ష్మయ్య, టీఆర్ఎస్ నాయకులు రాజప్ప, మొగులయ్య, కృష్ణయ్యగౌడ్ పాల్గొన్నారు.
తహసీల్దార్కు వినతి పత్రం అందజేత
కొందుర్గు, మార్చి 28: వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయా లని డిమాండ్ చేస్తు సోమవారం కొందుర్గు మండల రైతు బంధు కమిటీ ఆధ్వర్యంలో తహసీల్దారు శ్రీకాంత్రెడ్డికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో పీఎసీఎస్ చైర్మన్ చిట్టెం దామోదర్రెడ్డి, రైతు సమన్వయ కమిటీ అధ్యక్షుడు రెడ్డి నర్సిం హులు, ఎదిర రామకఋష్ణ, జగదీశ్వర్గౌడ్, రామచంద్రయ్య, పాపయ్య, యాదయ్య, పాల్గొన్నారు.
కేంద్రానికి గుణపాఠం తప్పదు
మంచాల మార్చి 28: వరి ధాన్యాన్ని మొత్తం కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని లేని పక్షంలో ఉద్యమం తప్పదని ఎంపీపీ జాటోతు నర్మద అన్నారు. సోమవారం మం చాల మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో యాసంగిలో కేంద్రప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు చేయాలంటూ మండల ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో వివిద గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధులు ఏకగ్రీవంగా తీర్మాణం చేశారు. అనంతరం ఎంపీ డీవో శ్రీనివాస్కు వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో వివిధ గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచ్లు, అధికారులు పాల్గోన్నారు.
రైతులకు అండగా నిలుస్తాం
దోమ, మార్చి28 :యాసంగి సీజన్లో రైతులు పండించిన వడ్లను కొంటామని కేంద్ర స్పష్టమైన హామీ ఇచ్చేంతవరకు రైతులకు అండగా ఉంటామని టీఆర్ఎస్ పార్టీ మం డల అధ్యక్షుడు గోపాల్గౌడ్, ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి అన్నారు. దోమ మండల పరిధిలోని బొంపల్ల్లి , పాలేపల్లి గ్రామాల్లో రైతులతో సంతకాలు తీసుకొని తీర్మానించారు. కార్యక్రమంలో బొంపల్లి సర్పంచ్ కోళ్ల సురేశ్, ఎంపీటీసీ రాములు, ఉప సర్పం చ్ రఫీక్పాషా, గ్రామ కమిటీ అధ్యక్షుడు పవన్ యాదవ్, రైతు బంధు కోఆర్డినేటర్ షేర్ఖాన్, పాలేపల్లి ఉప సర్పంచ్ రమేశ్ , తిరుపతయ్యసాగర్,అంజి పాల్గొన్నారు.
వడ్లను కొనే వరకు ఊరుకోం
షాద్నగర్, మార్చి28: తెలంగాణ రైతులు పండించిన వడ్లను కేంద్రం పూర్తిస్థాయిలో కోనే వరకు ఊరుకోమని షాద్నగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ మన్నె కవిత హెచ్చరించారు. సోమ వారం మార్కెట్ కార్యాలయంలో వడ్ల కొనుగోలుపై పాలక మండలిలో తీర్మానం చేసిన అనంతరం మాట్లాడారు. తెలంగాణ రైతులను, ప్రజలను కించపర్చే విధంగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడటం బాధకరమని, రైతులను అవమానిస్తే తగిన బుద్ది చెప్తామని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రైతుల శ్రేయస్సు కోసం నిత్యం శ్రమిస్తుంటే, కేంద్ర ప్రభుత్వం రైతుల నోట్లో మట్టికొడుతుందని వాపోయారు. రైతుల పక్షాన ఉద్యమిం చేందుకు అన్ని వర్గాల ప్రజలు కలిసిరావాలని కోరారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నారాయణరెడ్డి, డైరెక్టర్లు పాల్గొన్నారు.
యాలాల మండలంలో..
యాలాల మార్చి 28: కేంద్రం వడ్లు కొనాలని యాలాల మండలం కోకట్ గ్రామ సర్పంచ్ ప్యాస హంసమ్మ, సభ్యులు తీర్మాణం చేశారు. కార్యక్రమంలో కో ఆప్షన్ సభ్యులు భీంరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు శంకర్ రెడ్డి, వడ్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.