రూ. 50 లక్షలతో పనులు
18 సీసీ కెమెరాలు ఏర్పాటు
జిగేల్మంటున్న విద్యుత్దీపాలు
కళకళలాడుతున్న ప్రకృతి వనం
ఏ వీధి చూసినా సీసీ రోడ్లే
చేవెళ్ల రూరల్, మార్చి 31: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం అధిక నిధులు వెచ్చించడంతో గ్రామాలు అభి వృద్ధిలో దూసుకుపోతున్నాయి. పల్లె ప్రగతి పనులతో సీఎం కేసీఆర్ హయాంలో గ్రామాలు అభివృద్ధి చెందు తున్నాయి. అభివృద్ధిలో మిగతా గ్రామాలకు రావులపల్లి స్ఫూర్తిగా నిలుస్తున్నది. రావులపల్లి గ్రామంలో జనాభా జనాభా 1250 మంది ఉండగా ఓటర్లు 800 మంది ఉన్నా రు. 117 మందికి ప్రభుత్వం తరపున ప్రతి నెలా పింఛన్లు అందుతున్నాయి. గ్రామంలో దాదాపు రూ.50 లక్షలతో పనులు చేపట్టారు. చిన్న పంచాయతీ అయినా అభివృ ద్ధిలో ఆదర్శంగా నిలుస్తున్నది. గ్రామ పంచాయతీలో ట్రా క్టర్, నీటి ట్యాంకర్ ఏర్పాటు చేసుకొని అభివృద్ధి పనులకు ఉపయోగిస్తున్నారు.
సొంత నిధులతో…
గ్రామ సర్పంచ్, సర్పంచ్ల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కేసారం శ్రీనివాస్ గ్రామాభివృద్ధిలో రాజీ లేకుండా సొంత నిధులు సైతం వెచ్చించి 18 సీసీ కెమెరాలు, విద్యుత్ స్థంభాలు ఏర్పాటు చేయించారు.
సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ..
గ్రామంలో ఏ వీధులను చూసినా సీసీ రోడ్లు దర్శమి స్తాయి. పారిశుధ్య నిర్వహణలో ముఖ్య భూమిక పోషించి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయించారు.
సమూల మార్పు..
పల్లె ప్రగతిలో భాగంగా గ్రామంలో సమూల మార్పులు జరిగాయి. ఏండ్లనాటి సమస్యలు ప్రగతి పనులతో కొట్టు కుపోయాయి. గ్రామస్తుల సహకారం, అధికా రుల పర్యవే క్షణతో గ్రామం అందంగా మారింది. ప్రమా దకరంగా ఉన్న పాడుబడ్డ బావులు, శిథిల ఇండ్లు తొల గించారు.
తడి, పొడి చెత్తపై అవగాన
తడి, పొడి చెత్త వేరు చేసి పారిశుధ్య సిబ్బందికి అందిం చేలా గ్రామస్తులకు పంచాయతీ సెక్రెటరీ లావణ్య ఆధ్వ ర్యంలో అవగాహన కల్పిస్తున్నారు. చెత్తను పంచాయతీ ట్రాక్టర్లో సేకరించి డంపింగ్ యార్డుకు తరలించేలా చర్యలు తీసుకుంటున్నారు.
అన్ని సౌకర్యాలతో వైకుంఠధామం..
ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే లా వైకుంఠధామం నిర్మాణం చేపట్టింది. వైకుంఠ ధా మంలో చివరి మజిలీ ప్రశాంతంగా ముగిసేలా సకల సౌక ర్యాలు కల్పించారు.
ఆహ్లాదాన్ని పంచుతున్న పల్లె ప్రకృతి వనం
పల్లె ప్రకృతివనం గ్రామస్తులకు ఆహ్లాదాన్ని పంచుతున్నది. వాటిలో వాకింగ్ ట్రాక్ల ఏర్పాటు, రకరాల మొక్కలు ఏర్పాటు చేసి వాటిని సక్రమంగా ఏపుగా పెరిగేలా సం రక్షణకు చర్యలు తీసుకుంటున్నారు.